ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని అక్టోబర్ 9వ తేదీన ప్రకటించనుంది. అక్టోబర్ 7వ తేదీ నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు ద్రవ్య విధాన కమిటీ(MPC) సమావేశమవుతుందని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. చివరి రోజు MPC తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడిస్తారు. వాస్తవానికి MPC ద్వైమాసిక సమావేశం గత నెల 29వ తేదీనే జరగాల్సి ఉంది. ఇండిపెండెంట్ సభ్యుల నియామకం జరగకపోవటం పాటు కనీసం నలుగురు సభ్యుల కోరమ్ లేని కారణంగా సమావేశం వాయిదా పడింది.

అందుకే కమిటీ సమావేశం ఆలస్యం
కమిటీలో చేతన్ ఘటే, పమీదువా, రవీంద్ర దోలకియాల నాలుగేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 29వ తేదీన ముగిసింది. వీరి స్థానంలో ప్రముఖ ఆర్థికవేత్తలు అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ, శషాంక్ బిడేలను నియమించింది. దీంతో MPC సమావేశం ఖరారు అయింది. ఆర్బీఐ చట్టం ప్రకారం బోర్డులో ఎక్స్టర్నల్ సభ్యుల పదవీ కాలం నాలుగేళ్లు. తిరిగి నియమితులయ్యేందుకు అర్హత లేదు. దీంతో వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. గత ద్వైమాసిక సమావేశం (ఆగస్ట్)లో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు కూడా యథాతథంగా ఉంచవచ్చునని భావిస్తున్నారు.

వడ్డీ రేట్ల జోలికి వెళ్లకపోవచ్చు
రిటైల్ ద్రవ్యోల్బణం అధికంగానే ఉన్నందున ఈసారి కూడా రెపో రేటు యథాతథస్థితికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా సరఫరాల పరమైన లోపాల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం కన్నా అధికంగానే ఉంటోంది. రెపో రేటు నిర్ణయానికి MPC రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి కీలక వడ్డీ రేట్ల జోలికి వెళ్లకపోవచ్చునని అంటున్నారు.

వడ్డీ రేట్లపై బ్రోకరేజీ సంస్థ
కొత్త సభ్యులు MPCని రెపో రేట్ల విషయంలో తటస్థం లేదా సడలింపు దిశగానే నడిపించవచ్చునని జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేసింది. అదే సమయంలో ఆర్బీఐ వైఖరిలో తక్షణ మార్పుకు ఆస్కారం లేదని కూడా పేర్కొంది. 2016లో MPC ఏర్పాటయిన తర్వాత జరుగుతున్న 24వ సమావేశం ఇది. వడ్డీరేటు పాత్రను నిర్ణయించేందుకు 2016లో ఆరుగురు సభ్యుల MPCకి మార్చింది ప్రభుత్వం. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ప్యానెల్లో సగం ఇండిపెండెంట్ సభ్యులు ఉంటారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications