ముంబై: ఆర్బీఐ చీఫ్ శక్తికాంతదాస్ కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేరకు ఆర్బీఐ ట్వీట్ చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో నీడీపీపుల్ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఏం మాట్లాడుతారనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు సంబంధించి ఊరట ఇచ్చే ప్రకటన చేస్తారనే ప్రచారం సాగుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి. ఈ కారణంగా ఉద్యోగులపై, వ్యాపారులపై ఒత్తిడి లేకుండా మూడు లేదా ఆరు నెలల పాటు ఊరట కల్పించవచ్చునని భావిస్తున్నారు.

మేం లోన్లు కట్టలేం
ప్రస్తుత పరిస్థితుల్లో లోన్లు కట్టలేని, క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఉందని కాబట్టి కాస్త ఊరట కల్పించాలని చాలామంది కోరుతున్నారు. కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న వ్యాపారస్తులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించే పరిస్థిలో లేమని ఇప్పటికే చేతులెత్తేస్తున్నారు.

ఈ రంగాలు కుదేలు
రియల్ ఎస్టేట్, పర్యాటక, ఆతిథ్యరంగాల వ్యాపారాలు కరోనాతో కుదేలయ్యాయి. వీటితో పాటు మరెన్నో రంగాలు నష్టాల్లో ఉన్నాయి. వ్యాపారాలు పూర్తిగా మూత పడటంతో కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారాల కోసం బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించలేమని పలు సంస్థల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు.

వాయిదా పద్ధతుల్లో..
కరోనా మహమ్మారి కారణంగా మూడు వారాల లాక్ డౌన్ దేశ భద్రత కోసమే. కానీ సామాన్య, మధ్య తరగతికు మాత్రం ఈఎంఐ, క్రెడిట్ కార్డు పేమెంట్స్ టెన్షన్ పట్టుకుంది. కాబట్టి ఆర్బీఐ ప్రెస్ మీట్ ఈ దిశగానే ఉంటుందని భావిస్తున్నారు. కొద్ది రోజులు తమ పేమెంట్స్ ఆపాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలోను ఈ దిశగా స్పందిస్తున్నారు. నెల సంపాదన ఆధారంగా చాలామంది హోమ్ లోన్, వెహికిల్ లోన్, ఇతర లోన్స్ తీసుకొని, ఈఎంఐలు చెల్లిస్తుంటారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications