ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి(SEBI) నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. Aptech లిమిటెడ్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారనే ఆరోపణల మీద సెబీ నోటీసులు జారీ చేసింది. రాకేష్కు చెందిన Aptech లిమిటెడ్ షేర్లకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్లో షేర్ హోల్డర్లుగా ఉన్న రమేష్ ఎస్ దమానీ, డైరెక్టర్ మధు జయకుమార్ సహా ఇతర కుటుంబ సభ్యుల పాత్రపై కూడా సెబీ ఆరా తీస్తోంది.
దర్యాఫ్తుకు సహకరించాలని రాకేష్కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించిన ఆధారాలు ఏమిటి అనేది వెల్లడి కావాల్సి ఉంది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణల మీద రాకేష్తో పాటు అతని భార్య రేఖ, సోదరుడు రాజేష్ కుమార్, అత్త సుశీలలు విచారణకు హాజరు కావాలని సెబి పేర్కొంది.

ఈ నెల 23న విచారణకు హాజరు కావాల్సిందిగా రాకేష్ సోదరి సుధకు అధికారులు సూచించారని తెలుస్తోంది. జనవరి 28న (నేడు) మరికొందరిని కూడా విచారణకు పిలిచారు. కాగా, ముంబైలోని సెబీ కార్యాలయంలో దర్యాఫ్తు అధికారి ఎదుట రాకేష్ హాజరైనట్లుగా తెలుస్తోంది. రెండు గంటల పాటు విచారించారు. ఆయన కుటుంబ సభ్యుల తరఫున హాజరైనట్లు లాయర్ తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications