న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించింది. అయితే జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటును మైనస్ 23.9 శాతం నమోదు చేసిన తర్వాత సెప్టెంబర్ క్వార్టర్లో మైనస్ 10 శాతం అంతకంటే క్షీణత నమోదు చేయవచ్చునని పలు సర్వేలు అంచనా వేశాయి. అయితే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు మైనస్ 7.5 శాతంగా నమోదయింది. ఈ మేరకు కేంద్రం ప్రకటించింది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో క్వార్టర్లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం ప్రారంభమైందని, ఇది ఆశాజనకమని తెలిపింది. ఒక నిర్దిష్ట వ్యవధిలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మొత్తం వ్యాల్యూ స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీని సూచిస్తుంది.

గత ఏడాది వృద్ధి.. ఇప్పుడు ప్రతికూలత
వ్యవసాయం, అటవీ-ఫిషరీస్, తయారీ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాలతో పాటు నిత్యావసర సేవలు పుంజుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 202-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అన్ని రంగాలు కాస్త పుంజుకోవడంతో వృద్ధిరేటు 7.5 శాతం ప్రతికూలత నమోదు చేసింది. 2020-21 రెండో త్రైమాసికంలో స్థిర కరెన్సీ(2011-12) వద్ద జీడీపీ రూ.33.14 లక్షల కోట్లుగా అంచనా వేయబడిందని, 2019-20 రెండో ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.35.84 లక్షల కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే మైనస్ 7.5 శాతంగా ఉంది. గత ఏడాది రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు 4.4 శాతంగా ఉంది.

టెక్నికల్గా ఆర్థిక సంక్షోభంలోకి..
రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 3.4 శాతం నమోదయింది. ట్రేడ్ అండ్ సర్వీసెస్ సెక్టార్ ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా మైనస్ 15.6 శాతం ప్రతికూలత నమోదు చేసింది. కాగా, రెండు వరుస త్రైమాసికాల్లో భారత జీడీపీ ప్రతికూలతను నమోదు చేసింది. దీంతో టెక్నికల్గా సంక్షోభంలోకి వెళ్లినట్లు. అయితే ఆర్థిక కార్యకలాపాలు కోలుకుంటుండటం గమనార్హం. భారత్ 1997-98 ఆర్థిక సంవత్సరం నుండి త్రైమాసిక జీడీపీని విడుదల చేస్తోంది. మొదటిసారి టెక్నికల్ రిసెషన్లోక వెళ్లింది.

అంచనాలకు మించి...
భారత వృద్ధి రేటు రెండో త్రైమాసికంలో వివిధ సంస్థలు అంచనా వేసిన దాని కంటే కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటుపై ఆర్బీఐ సహా వివిధ సంస్థలు అంచనా వేశాయి. రెండో త్రైమాసికంలో మైనస్ 8.6 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇండియా రేటింగ్స్ (మైనస్ 11.9 శాతం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (మైనస్ 10.7 శాతం), నోమురా (మైనస్ 10.4 శాతం), కేర్ రేటింగ్స్ (మైనస్ 9.9 శాతం), ఇక్రా లిమిటెడ్ (మైనస్ 9.5 శాతం), కొటక్ మహీంద్ర బ్యాంకు (మైనస్ 9.1 శాతం), డచ్ బ్యాంకు (మైనస్ 9 శాతం), బార్క్లేస్ (మైనస్ 8.5 శాతం), బోఫా మెరిల్ లించ్ (మైనస్ 8.2 శాతం), బ్యాంక్ ఆఫ్ బరోడా (మైనస్ 8 శాతం), ఐసీఐసీఐ బ్యాంకు (మైనస్ 8 శాతం), మోతీలాల్ ఓస్వాల్ (మైనస్ 6 శాతం) అంచనా వేశాయి.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications