Rice Prices Hike: ఇప్పటికే అన్ని వస్తువుల రేట్లు ఆకాశానికి చేరుకోగా తాజాగా ఆ లిస్ట్ లో బియ్యం కూడా చేరిపోయింది. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల కిలో బియ్యం ధర రూ.10 నుంచి రూ.15 మధ్య పెరిగింది. కేంద్రం 25 కిలోల కంటే తక్కువ బ్రాండెడ్ ప్యాకింగ్ వస్తువులపై జీఎస్టీ అమలు చేయటం కూడా ఇందుకు ఒక కారణంగా నిలుస్తోంది.

దిగుబడి తగ్గటంతో..
రానున్న కాలంలో బియ్యం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్లో దిగుబడి తగ్గుతుందని, దీనికి తోడు బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 11 శాతం పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి. ఈ కారణంగా బియ్యం బంగారంలా మారనుంది. సమాన్యులకు వీటి రేట్లు భారాన్ని పెంచవచ్చని కేంద్ర ఆహార మంత్రత్వ శాఖ ఈ మేరకు సమాచారం ఇచ్చింది.

ఎగుమతి విధానంలో మార్పు..
భారతదేశం బియ్యం ఎగుమతి విధానంలో ఇటీవలి సంస్కరణల వెనుక గల కారణాలను మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటి వల్ల ఎగుమతులపై ఎలాంటి మార్పులు లేకుండానే దేశంలో ధరలను ధరలను నియంత్రించటానికి సహాయపడతాయని అందులో వివరించారు. ఇప్పటికే నూకల ఎగుమతి నిషేధం, బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది.

తగ్గిన వరి ఉత్పత్తి..
దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. సుమారు 6 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి తగ్గడం, బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 11 శాతం పెరగడం వల్ల బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచ మార్కెట్లో భారత్ బియ్యం వాటా 40 శాతం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ 21.2 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. అందులో 34.9 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఉంది.

ఆర్గానిక్ ఫార్మింగ్..
ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియెంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వ సేంద్రియ సాగు ప్రోత్సాహక పథకాన్ని తెచ్చింది. అయితే ఇది కేవలం 1.50 శాతం భూమికి పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎరువుల సబ్సిడీ భారాన్ని తప్పించుకొనేందుకే కేంద్రం ఇలాంటి పనులు చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శ్రీలంక చేసిన తప్పే భారత్ చేస్తుందా అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఆహార భద్రతకు ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications