Post Office Schemes: కచ్చితమైన రాబడి ఇచ్చే పోస్టాఫీస్ పథకాలు ఇవే..
భారత్ లో ఎక్కువగా మధ్య గరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఉంటారు. వీరు సంపాదించిన డబ్బులో కొంత మొత్తం పొదువు చేస్తారు. వీరు ప్రభుత్వ పథకాల్లో ఎక్కువ పొదుపు చేస్తారు. ముఖ్యంగా పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడులు పెడతారు. ఎందుకంటే ఇందులో రక్షణ ఉంటుంది. కాబట్టి. అయితే చాలా రకాల పోస్టాఫీస్ పథకాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం..ఈ పోస్టల్ సేవింగ్స్ పథకాలలో పన్ను ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
సేవింగ్స్ ఖాతా
పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా అనేది బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లాగా పనిచేస్తుంది. బ్యాంకుల మాదిరిగానే భారతదేశంలో ఎక్కడైనా బదిలీలు చేయవచ్చు. ఈ సేవింగ్స్ ఖాతా 4% వడ్డీ రేటును పొందుతారు. మీరు కనీసం రూ.500 నుంచి ఆదా చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఇందులో పెద్దలతో పాటు పిల్లలు కూడా పొదువు చేయవచ్చు. రూ.10,000 వరకు పన్ను లేదు.
రికరింగ్ డిపాజిట్
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంకుల మాదిరిగానే పనిచేసినప్పటికీ, బ్యాంకు కంటే పోస్టాఫీసులో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. గరిష్ట వడ్డీ 5.8%. మీరు కనీసం 100 రూపాయల నుంచి డిపాజిట్ చేయవచ్చు. దీనికి కూడా గరిష్ట పరిమితి లేదు.
టైమ్ డిపాజిట్
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం 5.5% - 6.7% వడ్డీ రేటును అందిస్తుంది. ఇందులో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఈ పథకానికి పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మంత్లీ ఇన్కమ్ స్కీమ్
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇది అన్ని ప్రైవేట్ రంగ ఉద్యోగులు, మహిళలు, వారి వృద్ధాప్యంలో ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్, మహిళలకు అనుకూలంగా ఉంటుంది. ఇది నెలవారీ ఆదాయాన్ని అందించే పెట్టుబడి ప్రణాళిక.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన పథకం. దీని మెచ్యూరిటీ 5 సంవత్సరాలు. దీన్ని మరో 3 ఏళ్లు పొడిగించవచ్చు. ఈ పథకం వడ్డీ రేటు 7.4%. ఇందులో కనీసం 1000 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి 15 లక్షల పరిమితి కాదు. ఇందులో 60 ఏళ్లు పైబడిన పింఛనుదారులు, 50 ఏళ్లు పైబడిన వీఆర్ఎస్ కొనుగోలు చేసినవారు ప్రయోజనం పొందవచ్చు. దీనికి పన్ను మినహాయింపు కూడా ఉంది.
జనరల్ ప్రావిడెంట్ ఫండ్
పోస్టాఫీసు పథకాలు చాలా మంది జనరల్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ను ఇష్టపడతారు. వడ్డీ రేటు 7.1%. ఇందులో సంవత్సరానికి గరిష్టంగా 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు కనీసం రూ. 500 పెట్టుబడి పెట్టవచ్చు. ఇది వ్యక్తిగత లేదా పిల్లల పేరుతో కూడా ప్రారంభించవచ్చు. ఇది ఉత్తమ దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికగా ఉపయోగపడుతుంది.
సుకన్య సుమృద్ధి యోజన
సుకన్య సుమృద్ధి యోజన, ఆడపిల్లల కోసం ప్రత్యేక పథకం, వారి భవిష్యత్తు సంక్షేమం కోసం రూపొందించారు. ఈ పథకంలోని మూలధనంపై పన్ను మినహాయింపు ఉంటుంది. చదువు, పెళ్లి ఖర్చుల కోసం పెట్టుబడులు పెట్టవచ్చు. దీనికి వడ్డీ రేటు 7.6%. ఇందులో మీరు సంవత్సరానికి కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.