PMC బ్యాంకు అవకతవకల నేపథ్యంలో ఆ బ్యాంకు డిపాజిటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ డబ్బులు తమ చేతుల్లోకి రావడంపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం సంబంధిత ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. బ్యాంకు ఆస్తులు వేలం వేసి డిపాజిటర్లకు చెల్లించే అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. బ్యాంకులోని ఉన్నతాధికారులు చేసిన తప్పులకు డిపాజిటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ జోక్యం చేసుకొని, డిపాజిటర్లకు సాయం చేసే దిశగా చర్చిస్తున్నారు.
ఈ భేటీ యొక్క ప్రాథమిక అజెండా.. అటాచ్ చేసిన ఆస్తుల వేలం, డిపాజిటర్లకు తిరిగి చెల్లించేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలపై చర్చించారు. అలాగే సంక్షోభంలో కూరుకుపోయిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు (PMC) పునర్నిర్మాణానికి నిధుల అంశంపై కూడా చర్చించారని తెలుస్తోంది.

ఆర్బీఐ గవర్నర్, ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ బార్వే, ఎకనమిక్ ఆఫెన్స్ వింగ్ (EOW) జాయింట్ కమిషనర్ రాజవర్ధన్ సిన్హా, EOW డీసీపీ శ్రీకాంత్ పరోపకారీ, ఈడీ డైరెక్టర్ సంజయ్ మిశ్రా, ఈడీ స్పెషల్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ సత్యబ్రాత కుమార్, పీఎంసీ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ తదితరులు ఈ భేటీలో ఉన్నారని తెలుస్తోంది.
కీలక సమావేశం జరిగిందని, బ్యాంకు రికవరీకి మార్గం సుగమం చేసేందుకు, ఖాతాదారుల సమస్యలు పరిష్కరించేందుకు భేటీ అయ్యామని మాజీ ఎంపి కీరీట్ సోమయ్యా ఇండియా టుడేతో చెప్పారు. పీఎంసీ బ్యాంకు ఖాతాదారులకు సహాయం కోరేందుకు తాను గవర్నర్ను కూడా కలిసినట్లు చెప్పారు. సహకరిస్తానని గవర్నర్ చెప్పారు.
కాగా, పీఎంసీ బ్యాంక్ కేసులో ఈడీ, EOWలు రూ.4,000 కోట్ల ఆస్తులను అటాచ్ చేశాయి. మరికొన్ని ఆస్తుల అటాచ్మెంట్ కొనసాగుతోంది. కాగా, అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయడానికి అభ్యంతరం లేదని EOW కోర్టుకు తెలిపింది. ఆస్తుల వేలం కోసం ఓ ఏజెన్సీని సంప్రదించి, ఆదాయం వచ్చేలా చేస్తారు. దీంతో డిపాజిటర్ల సమస్యలు తగ్గించవచ్చునని భావిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications