pm kisan: వ్యవసాయ రంగం భారతదేశానికి వెన్నెముక వంటిది. దేశంలోని అధిక జనాభా ఈ విభాగానికే పరిమితమయ్యారు. ఎన్నికల వేళ ప్రధాని మోడీ సైతం, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం వివిధ రకాల పథకాలను రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. తాజాగా ఈ పథకానికి సంబంధించి మోడీ సర్కారు శుభవార్త చెప్పింది.

13వ విడత విడుదల:
PM కిసాన్ లబ్ధిదారులకు 13వ విడత నిధులను.. కర్ణాటకలోని బెళగావించి నుంచి ప్రధాని మోడీ సోమవారం విడుదల చేశారు. మొత్తం రూ.16 వేల కోట్ల ద్వారా 8 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందనున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని మొదటగా ప్రారంభించారు. ప్రతి 4 నెలలకు ఒకసారి.. సొంత పంటభూమి ఉన్న ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 వేల చొప్పున మొత్తం ఏడాదికి రూ.6 వేలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ నాలుగేళ్లలో ఇప్పటివరకు 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.2.2 లక్షల కోట్లను పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కర్షకుల ఆదాయం పెంపునకు:
రైతులకు పెట్టుబడికోసం కొంత మొత్తాన్ని సాయంగా అందించి, వారి ఆదాయాన్ని మరింత పెంచాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రంగ అభివృద్ధికి పీఎం కిసాన్ యోజన మరింత ఊతమిస్తుందని అభిప్రాయపడింది. కొన్ని ప్రమాణాలకు లోబడి, దేశంలోని రైతులందరూ ఈ పథకం కింద అర్హులేనని వెల్లడించింది. ఈ నిధులు గ్రామీణ ఆర్థికవృద్ధికి, రైతులకు రుణ పరిమితి సడలింపునకు, వ్యవసాయ పెట్టుబడిని తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయని పేర్కొంది.

ఏపీ రైతులకు మరో శుభవార్త:
కేవలం వ్యవసాయం కోసమే కాకుండా పలువురు ఈ నిధులను విద్య, వైద్యం, సంరక్షణ, వివాహాలు వంటి ఇతర ఖర్చులను తీర్చుకోవడానికి సైతం వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన PM కిసాన్ లబ్ధిదారులకు రూ.2 వేలే కాకుండా కొంత ఎక్కువ మొత్తం అందనుంది. ఈ పథకానికి అదనంగా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం సైతం కొంత మొత్తాన్ని కలిపి కర్షకుల ఖాతాల్లో జమ చేయనుండడమే ఇందుకు కారణం. అతి త్వరలోనే ఈ మొత్తం రైతు ఖాతాల్లోకి చేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications