న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐకనిక్ వారోత్సవాలను ప్రారంభించారు. కేంద్ర ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన వారోత్సవాలు ఇవి. కొద్దిసేపటి కిందట దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీ.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్తో కలిసి ఈ వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలయిన సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు నిర్వహిస్తోన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో దీన్ని ఏర్పాటు చేశారు. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో ఇదే ఈ కార్యక్రమాన్ని మోడీ ఆరంభించారు. దీనితోపాటు- జన్ సమర్థ్ వెబ్సైట్ను ఆవిష్కరించారు. వన్-స్టాప్ డిజిటల్ పోర్టల్ ఇది.
12 శాఖలు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల వివరాలు, క్రెడిట్ లింక్స్ను ఇందులో పొందుపరిచారు. ఆయా పథకాలను ఈ పోర్టల్ ద్వారా ఒకే వేదిక మీదికి తీసుకొచ్చారు. సమ్మిళిత అభివృద్ధి, ఆర్థిక సంవత్సరాల వారీగా అన్ని రంగాలు సాధించిన పురోగతిని ఇందులో పొందుపరిచారు. వాటికి సంబంధించిన సమాచారాన్ని మరింత వివరంగా ప్రజలకు చేరవేసేలా ఈ పోర్టల్ అందుబాటులో ఉంటుంది.

అనంతరం కొత్త రూపాయి నాణేలను విడుదల చేశారు. 1, 2, 5, 10, 20 సిరీస్కు చెందిన రూపాయి నాణేలను ఆయన చలమణిలోకి తీసుకొచ్చారు. ఈ నాణేలపై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లోగోను ముద్రించారు. అంధులు కూడా సులభంగా గుర్తించాల వాటిపై అంకెలను ప్రింట్ చేశారు.
వీటిని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్య్రం సిద్ధించి 100 సంవత్సరాల మైలురాయిని అందుకునే ఈ పాతికేళ్ల సమయాన్ని అమృత కాలంగా ప్రకటించామని, ఈ విషయాన్ని దేశ పౌరులకు ప్రతిక్షణం గుర్తు చేసేలా ఈ నాణేలను అందుబాటులోకి తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. ఎనిమిది సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధించిన ప్రగతిని తెలియజేసేలా రూపొందించిన డిజిటల్ ఎగ్జిబిషన్ను కూడా మోడీ ప్రారంభించారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications