Prices Drop: నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టాయని, దీంతో నెలవారీ వంటగది బడ్జెట్ ఉపశమనం లభించిందని ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 11 వస్తువుల ధరల తగ్గుదల వివరాలతో కూడిన చార్ట్ను పంచుకున్నారు.
నూనెల ధరలు..
2022 సెప్టెంబర్ 2న లీటరుకు రూ.132గా ఉన్న పామాయిల్ ధర అక్టోబర్ 2 నాటికి 11 శాతం తగ్గి రూ.118కి చేరింది. వనస్పతి కిలో రూ.152 నుంచి 6 శాతం తగ్గి రూ.143కి చేరింది. సన్ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్కు రూ.176 నుంచి 6 శాతం తగ్గి రూ.165కి చేరగా, సోయాబీన్ ఆయిల్ లీటరుకు రూ.156 నుంచి 5 శాతం తగ్గి రూ.148కి చేరుకుంది. ఇదే క్రమంలో ఆవనూనె ధర రూ.173 నుంచి 167 తగ్గగా.. వేరుశెనగ నూనె లీటరు రూ.189 నుంచి 2 శాతం తగ్గి రూ.185కి చేరింది.

ఇతర వస్తువుల ధరలు..
ఉల్లి ధర కిలో రూ.26 నుంచి 8 శాతం తగ్గి రూ.24కి, బంగాళదుంప ధర 7 శాతం తగ్గి కిలో రూ.28 నుంచి రూ.26కి చేరింది. పప్పుధాన్యాల్లో కిలో రూ.74 నుంచి రూ.71కి, మసూర్ దాల్ రూ.97 నుంచి 3 శాతం తగ్గి రూ.71కి, మినపప్పు కిలో రూ.108 నుంచి రూ.106కి చేరుకుందని గోయల్ తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.

తగ్గుదలకు కారణం..?
ప్రపంచ వ్యాప్తంగా ధరల పతనం కారణంగా వంటనూనెల ధరలు భారీగా తగ్గినట్లు ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి తోడు భారత ప్రభుత్వం దిగుమతు సుంకాలను తగ్గించటం గణనీయంగా ధరలు తగ్గటానికి ఎంతగానో దోహదపడింది. ఎడిబుల్ ఆయిల్స్పై రాయితీ దిగుమతి సుంకాలు మార్చి 2023 వరకు అమలులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

లక్షల కోట్ల దిగుమతులు..
భారత వంటనూనె అవసరాల్లో 60 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. అక్టోబర్తో ముగిసిన 2020-21 కాలానికి మనదేశం రికార్డు స్థాయిలో రూ.1.17 లక్షల కోట్ల విలువైన ఎడిబుల్ ఆయిల్ను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తున్నందున కంపెనీలు ముందుగానే భారీ స్థాయిలో ఆయిల్ దిగుమతులు చేసుకున్నాయి.

ఎదురుదాడి చేస్తున్న సామాన్యులు..
పీయూష్ గోయల్ చేసిన ట్వీట్ పై సామాన్యులు ధ్వజమెత్తుతున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక రూపాయి పతనమైందని ఒకప్పుడు డాలరుకు 62 నుంచి 81కి పడిపోయిందని ఒకరు కామెంట్ చేశారు. మరొకరైతే ఫైనాన్స్ మంత్రికి తెలివి లేదని, మిగతా మంత్రులు యథా రాజా తథా మంత్రి అన్నట్లుగానే ఉన్నారని కామెంట్ చేశాడు. ఇలా అనేక మంది కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications