పెట్రోల్, డీజిల్పై ట్యాక్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి పైన పోరు కోసం అదనపు నిధులను సమీకరించే ఉద్దేశ్యంలో భాగంగా ట్యాక్స్ పెంచే అవకాశాలపై సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. కరోనా కారణంగా కేంద్రానికి ఆదాయం తగ్గడమే కాకుండా, వైరస్ను ఎదుర్కొనేందుకు ఖర్చులు పెరిగాయి. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని ఆలోచిస్తోంది. లీటర్ పైన రూ.6 వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

రూ.60,000 కోట్ల అదనపు ఆదాయం
ఎక్సైజ్ సుంకాన్ని రూ.6 వరకు పెంచడం ద్వారా ఏడాదికి రూ.60,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సుంకం పెంపుకు ఇది సరైన సమయమని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి విధివిధానాలపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ పెంపు నిర్ణయం అమలులోకి వస్తే, ఎప్పటి నుండి వస్తుందనేది త్వరలో వెల్లడించనున్నారు.

పెంపుకు పార్లమెంటరీ అనుమతి
కేంద్ర ప్రభుత్వం మార్చిలో పెట్రోల్ పైన రూ.18, డీజిల్ పైన రూ.12 ఎక్సైజ్ డ్యూటీని పెంచేందుకు పార్లమెంటరీ అనుమతి తీసుకుంది. అయితే అప్పుడు లెవీనీ మార్చలేదు. మే నెలలో ఎక్సైజ్ సుంకాన్ని అదనంగా పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన రూ.9కి పెంచింది. ఈ లెక్కన పెట్రోల్ పైన మరో రూ.6, డీజిల్ పైన మరో రూ.3 పెంచేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు పార్లమెంటరీ అనుమతి కూడా తీసుకుంది.

పన్నులు 75 శాతం నుండి 80 శాతానికి
రూ.3 నుండి రూ.6 వరకు ఎక్సైజ్ డ్యూటీ పెంచినప్పటికీ వినియోగదారులపై ఆ మేరకు భారంపడే అవకాశాలు ప్రస్తుతానికి తక్కువ అంటున్నారు. చమురు ధరలు తక్కువగా ఉండటంతో రిటైల్ ధరల్లో స్వల్పంగా మార్పు ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంధనంపై 70 శాతం పన్నులు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ పెంచితే 75 నుండి 80 శాతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. చమురు ఆదాయాన్ని రూ.1.75 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

భారీగా పెరిగిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై టికెట్ ఛార్జీల మోత తప్పదిక..

Oil prices: ముదురుతున్న యుద్ధం! ఊహించని స్థాయిలో ఆయిల్ రేట్లు పెరగనున్నాయా?

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications