బ్యాంకుల రుణాల్లో భారీగా పెరిగిన పర్సనల్ లోన్లు, ఆర్బీఐ డేటా
గత ఏడాది కాలంలో బ్యాంకు లోన్లలో ఎక్కువగా వ్యక్తిగత రుణాలే ఉంటున్నాయట. దేశంలో ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాల వాటా భారీగా పెరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. గత ఫిబ్రవరి చివరి నాటికి బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల వ్యాల్యూ రూ. 89.8 లక్షల కోట్లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 7.3 శాతం ఎక్కువ.
ట్రంప్ లాక్డౌన్కు ఎందుకు దూరం జరిగారు, రెండు కారణాలివే!
ఈ రుణాల్లో మాన్యుఫాక్చరింగ్ రంగం వాటా 31 శాతం. రూ. 27.9 లక్షల కోట్లుగా ఉంది. ఈ రంగం రుణ వితరణలో గత ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. పర్సనల్ రుణాల వాటా 28 శాతంతో రూ.25.3 లక్షల కోట్లుగా ఉంది. ఈ రంగంలో గత ఏడాదితో పోలిస్తే అత్యధికంగా 17 శాతం పెరుగుదల ఉంది.
హోమ్ లోన్ వాటా 14.8 శాతంతో రూ.13.3 లక్షల కోట్లుగా ఉంది. ఇతర రుణాలు రూ.7 లక్షల కోట్లుగా ఉందని RBI తెలిపింది. వ్యక్తిగత రుణాలు ఇచ్చిన సంస్థల్లో ఎక్కువ శాతం నాన్ బ్యాంకింగ్ సంస్థలే ఉన్నాయి. పర్సనల్ లోన్స్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ముందున్నాయి. 2019 ఫిబ్రవరి నాటికి రూ.5.75 లక్షల కోట్ల నుండి 22 శాతం పెరుగుదలతో రూ.7 లక్షల కోట్లకు పెరిగాయి.