For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీ-తెలంగాణలలో పేటీఎం ఆల్ ఇన్ వన్ QR కోడ్, ఛార్జీల్లేవు

|

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు, మరింత మంది వ్యాపారులు డిజిటల్ చెల్లింపులు స్వీకరించేందుకు సరికొత్త సదుపాయాన్ని పేటీఎం అందుబాటులోకి తీసుకు వచ్చింది. హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో All in One QRను ప్రవేశ పెట్టింది.

అలా ఐతే ఫైన్: క్రెడిట్ కార్డు టు పేటీఎం టు అకౌంట్, ఆ కస్టమర్‌కు పేటీఎం ఝలక్అలా ఐతే ఫైన్: క్రెడిట్ కార్డు టు పేటీఎం టు అకౌంట్, ఆ కస్టమర్‌కు పేటీఎం ఝలక్

వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేయం

వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేయం

పేటీఎం వ్యాలెట్, రుపే కార్డులు, అన్ని UPI ఆధారిత పేమెంట్ యాప్స్ ద్వారా కొనుగోలుదారులు చేసే డిజిటల్ చెల్లింపుల్ని వ్యాపారులు స్వీకరించడానికి ఈ QR కోడ్ ఉపయోగపడుతుంది. పరిమితి లేకుండా కొనుగోలుదారులు చెల్లింపులు చేసుకోవచ్చు. చెల్లింపులు స్వీకరించే వ్యాపారుల నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేయమని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌరబ్ శర్మ తెలిపారు.

పదిహేను రోజుల్లో దేశవ్యాప్తంగా..

పదిహేను రోజుల్లో దేశవ్యాప్తంగా..

ఆల్ ఇన్ వన్ QRను హైదరాబాద్‌లో సోమవారం విడుదల చేశారు. ఇదే సమయంలో హైదరాబాదుతో పాటు మరో ఏడు నగరాల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. రానున్న పదిహేను రోజుల్లో దీనిని దేశ వ్యాప్తంగా ప్రవేశపెడతారు. QR కోడ్‌తో దుకాణాల్లో వినియోగించే కాలుక్యులేటర్, గడియారాలు, పెన్ స్టాండ్స్, సౌండ్ బాక్స్ తదితరాలను పేటీఎం విడుదల చేసింది.

వ్యాపారులు సౌండ్ వినవచ్చు

వ్యాపారులు సౌండ్ వినవచ్చు

ఎవరైనా కొనుగోలుదారు చెల్లింపు చేసిన వెంటనే వ్యాపారులు దానిని సౌండ్ బాక్స్‌లో వినవచ్చు. QR కోడ్ ద్వారా కొనుగోలుదారులు చేసే చెల్లింపులు నేరుగా సదరు వ్యాపారుల బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతాయి.

ఏపీ, తెలంగాణలలో...

ఏపీ, తెలంగాణలలో...

సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆల్ ఇన్ వన్ QR కోడ్ ప్రవేశ పెట్టారు. ఏపీ, తెలంగాణలలో పేటీఎంను వినియోగించి కొనుగోలుదారులు చేసే చెల్లింపులను 15 లక్షల మంది వ్యాపారులు స్వీకరిస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ సంఖ్యను 30 లక్షల నుంచి 35 లక్షలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలో 60 శాతం వృద్ధి నమోదయింది.

మర్చంట్స్‌ను 2.5 కోట్లకు పెంచుకోవడమే లక్ష్యం

మర్చంట్స్‌ను 2.5 కోట్లకు పెంచుకోవడమే లక్ష్యం

ఆల్ ఇన్ వన్ QR కోడ్‌ను లాంచ్ చేసిన అనంతరం సౌరబ్ శర్మ మాట్లాడుతూ... ఇప్పటికే 1.5 కోట్ల మంది మర్చంట్స్ ఉన్నారని, వచ్చే ఏడాది ఈ సంఖ్యను 2.5 కోట్లకు పెంచుకోనున్నట్లు తెలిపారు.

English summary

ఏపీ-తెలంగాణలలో పేటీఎం ఆల్ ఇన్ వన్ QR కోడ్, ఛార్జీల్లేవు | Paytm launches All in One QR

Paytm has launched All in One QR on Monday which enables merchants to accept unlimited payments through Paytm wallet, Rupay cards, any third party UPI, at zero % fee. Addressing a press conference held in Hyderabad on Monday, vice-president of Paytm, Saurabh Sharma, said that they have launched it concurrently in eight cities across the country.
Story first published: Tuesday, January 21, 2020, 8:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X