పాసింజర్ వెహికిల్ హోల్సేల్ విక్రయాలు 14% జంప్
అక్టోబర్ నెలలో ప్యాసింజర్ వెహికిల్ హోల్ సేల్సేల్స్(PV) 14 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు సొసటైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ నెలలో 2,71,737 యూనిట్లు సేల్ కాగా ఈసారి 3,10,294 యూనిట్లకు పెరిగాయి. బైక్స్ హోల్సేల్ విక్రయాలు 16.88 శాతం, మోటార్ సైకిళ్ల సేల్స్ 23.8 శాతం, స్కూటర్ విక్రయాలు 1.79 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
ఒక త్రీవీలర్ సేల్స్ మాత్రం 60.91 శాతం పడిపోయాయి. దీపావళి పండుగ నేపథ్యంలో వినియోగదారుల డిమాండ్ పెరుగుతుందని డీలర్లు భావిస్తున్నారని, ఇందుకు వారు సిద్ధమయ్యారని SIAM డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. ఈసారి హోల్సేల్ విక్రయాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆటో సేల్స్ అక్టోబర్ నెలలో భారీగా పుంజుకున్న విషయం తెలిసిందే. దసరా, దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్లో వాహనాల సేల్స్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. హీరో మోటోకార్ప్కు ఫెస్టివెల్ సీజన్ కలిసి వచ్చింది. టాటా మోటార్స్ సేల్స్ నెలల గరిష్టాన్ని తాకడం గమనార్హం. మారుతీ చరిత్రలో ఓ నెలలో ఎక్కువ సేల్స్ అక్టోబర్ నెలలో నమోదయ్యాయి. ప్రతి నిమిషానికి 4 కార్లు విక్రయించింది ఈ సంస్థ.