ఆధార్ కార్డు-పాన్ కార్డు గడువును కేంద్ర ప్రభుత్వం గతంలో మార్చి 31, 2021కి పొడిగించింది. అంతకుముందు వివిధ కారణాలతో దీనిని పొడిగిస్తూ వచ్చింది. తాజాగా కరోనా మహమ్మారి వంటి కారణాలతో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అవకాశం కల్పించింది. ఆ గడువులోగా ఆధార్-పాన్ లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ పలుమార్లు సూచించింది. అయితే చాలామంది ఇంకా లింక్ చేయకుండా ఉన్నారు. ఇంకా కోట్లాది పాన్ కార్డులు ఆధార్ కార్డుతో లింక్ చేయలేదు. ఇందులో డూప్లికేట్ అంటే ఒకరికి ఒకటికి మించి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.

18 కోట్ల పాన్ కార్డులు క్యాన్సిల్!
మార్చి 31, 2021 నాటికి ఆధార్ కార్డుతో లింక్ చేయని పాన్ కార్డులను ఐటీ శాఖ నిర్వీర్యం చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు లింక్ చేయని పాన్ కార్డులు దాదాపు 18 కోట్లు ఉన్నాయని, గడువు ముగిసేలోగా వాటిని ఆధార్తో జత చేసుకోవాలని సూచించింది ఐటీ శాఖ. లేదంటే వాటిని క్యాన్సిల్ చేయనున్నట్లు వెల్లడించింది. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగించే వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తాల్లో ట్రాన్సాక్షన్స్ జరిపే వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు ఐటీ అధికారులు తెలిపారు.

రెండు పాన్ కార్డులు... లగ్జరీగా ఖర్చులు
కొంతమంది లగ్జరీగా ఖర్చులు చేస్తూ పన్నులను ఎగవేసేందుకు ఒకటి కంటే ఎక్కువ పాన్కార్డులు ఉపయోగిస్తున్నారన్నారు. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేస్తే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందే అవకాశం ఉండదని, అందుకే లింక్ చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ డెబిట్ కార్డులు వంటి వ్యవస్థల ద్వారా జరిగే భారీ ట్రాన్సాక్షన్స్ను గుర్తించి ఆ ఖర్చులపై కూడా ఐటీ శాఖ నిఘా పెడుతుంది.

ఐటీ రిటర్న్స్.. జీలో ట్యాక్స్
దేశంలో 50.95 కోట్ల పాన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. కానీ 6.48 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తుండగా, 1.5 కోట్ల మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. దాదాపు 4.98 కోట్ల మంది ఐటీఆర్ దాఖలు చేస్తున్నారు. వీరంతా దాదాపు జీరో ట్యాక్స్ లయబులిటీ లేదా ఫుల్ అమౌంట్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. మరికొంతమందికి ఒకటికి మించి పాన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 32.71 కోట్ల పాన్ కార్డులు మాత్రమే ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నాయి. దేశంలో130 కోట్లకు పైగా జనాభా ఉండగా కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications