ఇండియన్ కంపెనీల విదేశీ రుణాలు 45 శాతం పడిపోయాయి
వివిధ భారతీయ కంపెనీలు విదేశాల నుంచి తీసుకునే అప్పులు 2018 డిసెంబర్తో పోలిస్తే 2019 డిసెంబర్ నెలకు 45 శాతం మేర తగ్గి, 2.09 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 2018 డిసెంబర్ నెలలో భారతీయ కంపెనీలు 3.81 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించాయి. ఇందులో 37 మిలియన్లు మసాలా బాండ్స్ ద్వారా సేకరించారు.
కొత్త ఆదాయపు పన్ను స్లాబ్లోకి వచ్చేందుకే 70% మంది మొగ్గు
2019 డిసెంబర్లో ఆటోమేటిక్ రూట్ ఆఫ్ ఎక్స్టర్నల్ కమర్శియల్ బారోయింగ్(ECB) ద్వారా 1.2 బిలియన్ డాలర్లు సేకరించారు. 55.98 మిలియన్ డాలర్లు రూపీ డినామినేటెడ్ బాండ్స్ లేదా మసాలా బాండ్స్ ద్వారా సమీకరించారు.
ఆర్ఈసీ లిమిటెడ్ అప్రూవల్ మార్గంలో 500 మిలియన్ డాలర్లు, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా 250 మిలియన్ డాలర్లు కూడా సమీకరించారు. ఓవర్సీస్లో మసాలా బాండ్స్ ద్వారా కేవలం చోళమండలం మాత్రమే 55.98 మిలియన్ డాలర్లు సేకరించింది.