జూన్ నుంచి ఒకే దేశం ఒకే రేషన్ కార్డు, వారికి ఎంతో ఉపయోగం
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయనున్నారు. రేషన్ కార్డు ఉన్న పేదలు దేశంలోని ఏ ప్రాంతంలోని రేషన్ షాప్కైనా వెళ్లి సరుకులు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సదుపాయం వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం లోకసభకు తెలిపింది.
'జగన్-కేసీఆర్ ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండానే..!'
వీరికి లబ్ధి
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకం వల్ల వలస కార్మికులు, దినసరి కూలీలు లబ్ధి పొందుతారని రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారులు దేశంలోని ఏ రేషన్ దుకాణానికి అయినా వెళ్లి తమకు నిర్దేశించిన ఆహార ధాన్యాలను కొనుగోలు చేయవచ్చునని చెప్పారు.
వేలిముద్రలు, ఆదార్ ధ్రవీకరించుకోవడం ద్వారా
సదరు రేషన్ దుకాణంలోని ఈపోస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్)లో వేలిముద్రలు/ఆధార్ కార్డును ధ్రువీకరించుకోవడం ద్వారా ఈ సదుపాయం పొందవచ్చని రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు.
ఒకే కార్డు ఆలోచన లేదు
పౌరులంతా అన్ని సదుపాయాలు పొందేందుకు వీలుగా ఒకే కార్డును జారీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జాతీయ జనాభా రిజిస్టర్ను సిద్ధం చేసి, తాజాపరచాలని తమ ప్రభుత్వం ప్రతిపాదించిందని అన్నారు.