కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 25వ తేదీ నుండి కొనసాగిన లాక్ డౌన్ ఇప్పుడిప్పుడే అన్లాక్ అవుతోంది. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కానీ కరోనా దెబ్బ కారణంగా మూడింట ఒక వంతు స్వయం ఉపాధి, చిన్న-మధ్యతరహా వ్యాపారాలు కోలుకునే పరిస్థితి లేదని ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (AIMO) తెలిపింది. 9 ఇతర ఇండస్ట్రీ బాడీలతో కలిసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

రికవరీ కష్టమే
ఎంఎస్ఎంఈ, స్వయంఉపాధి, కార్పోరేట్ సీఈవోలు, ఉద్యోగులు తదితరుల నుండి AIMO 46,525 స్పందనలు తీసుకుంది. మే 24వ తేదీ నుండి మే 30వ తేదీ మధ్య ఆన్ లైన్ ద్వారా సర్వే చేసింది. ఎంఎస్ఎంఈల నుండి 35 శాతం, స్వయం ఉపాధి నుండి 37 శాతం మంది రికవరీ కష్టమని వెల్లడించాయి. ఎంఎస్ఎంఈలో 32 శాతం మంది రికవరీకి ఆరు నెలలు పడుతుందంటే, కేవలం 12 శాతం మంది మాత్రం మూడు నెలలు పడుతుందని తెలిపాయి.

కరోనా ఒక్కటే తీసిన దెబ్బ కాదు
కార్పోరేట్ సంస్థలు మూడు నెలల్లో కోలుకుంటాయని భావిస్తున్నాయి. అయితే కొంతమంది వ్యాపారాలు క్లోజ్ చేయడానికి కరోనా మహమ్మారి ఒక్కటే కారణంగా భావించడం లేదని సర్వేలో వెల్లడైంది. నోట్ల రద్దు, జీఎస్టీ, గత రెండు మూడేళ్లుగా కొనసాగిన మందగమనానికి కరోనా దెబ్బపడటంతో క్లోజ్ చేయాల్సిన పరిస్థితి అని తేలింది. నాటి నుండి అప్పుల్లో కూరుకుపోయి, కరోనా వల్ల కోలుకోలేని పరిస్థితికి చేరుకున్నారని AIMO మాజీ ప్రెసిడెంట్ కేఈ రఘునాథన్ అన్నారు. స్వాతంత్రానంతరం ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు.

మేం సేఫ్.. వారు కోలుకోలేరు
కరోనా వల్ల తమపై ఎలాంటి ప్రభావం పడలేదని 3 శాతం ఎంఎస్ఎంఈలు, 6 శాతం కార్పోరేట్స్, 11 శాతం స్వయంఉపాధికి చెందిన వారు చెప్పారు. ఎందుకంటే వీరు లాక్ డౌన్ సమయంలో అత్యవసరమైన ఎమర్జెన్సీ సేవల్లో ఉండటంతో వీరిపై ప్రభావం పడలేదు. మొత్తంగా 32 శాతం మంది రికవరీ కష్టమని, 29 శాతం మంది కోలుకోవడానికి 6 నెలలు పడుతుందన్నారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications