కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 25వ తేదీ నుండి కొనసాగిన లాక్ డౌన్ ఇప్పుడిప్పుడే అన్లాక్ అవుతోంది. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కానీ కరోనా దెబ్బ కారణంగా మూడింట ఒక వంతు స్వయం ఉపాధి, చిన్న-మధ్యతరహా వ్యాపారాలు కోలుకునే పరిస్థితి లేదని ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (AIMO) తెలిపింది. 9 ఇతర ఇండస్ట్రీ బాడీలతో కలిసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

రికవరీ కష్టమే
ఎంఎస్ఎంఈ, స్వయంఉపాధి, కార్పోరేట్ సీఈవోలు, ఉద్యోగులు తదితరుల నుండి AIMO 46,525 స్పందనలు తీసుకుంది. మే 24వ తేదీ నుండి మే 30వ తేదీ మధ్య ఆన్ లైన్ ద్వారా సర్వే చేసింది. ఎంఎస్ఎంఈల నుండి 35 శాతం, స్వయం ఉపాధి నుండి 37 శాతం మంది రికవరీ కష్టమని వెల్లడించాయి. ఎంఎస్ఎంఈలో 32 శాతం మంది రికవరీకి ఆరు నెలలు పడుతుందంటే, కేవలం 12 శాతం మంది మాత్రం మూడు నెలలు పడుతుందని తెలిపాయి.

కరోనా ఒక్కటే తీసిన దెబ్బ కాదు
కార్పోరేట్ సంస్థలు మూడు నెలల్లో కోలుకుంటాయని భావిస్తున్నాయి. అయితే కొంతమంది వ్యాపారాలు క్లోజ్ చేయడానికి కరోనా మహమ్మారి ఒక్కటే కారణంగా భావించడం లేదని సర్వేలో వెల్లడైంది. నోట్ల రద్దు, జీఎస్టీ, గత రెండు మూడేళ్లుగా కొనసాగిన మందగమనానికి కరోనా దెబ్బపడటంతో క్లోజ్ చేయాల్సిన పరిస్థితి అని తేలింది. నాటి నుండి అప్పుల్లో కూరుకుపోయి, కరోనా వల్ల కోలుకోలేని పరిస్థితికి చేరుకున్నారని AIMO మాజీ ప్రెసిడెంట్ కేఈ రఘునాథన్ అన్నారు. స్వాతంత్రానంతరం ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు.

మేం సేఫ్.. వారు కోలుకోలేరు
కరోనా వల్ల తమపై ఎలాంటి ప్రభావం పడలేదని 3 శాతం ఎంఎస్ఎంఈలు, 6 శాతం కార్పోరేట్స్, 11 శాతం స్వయంఉపాధికి చెందిన వారు చెప్పారు. ఎందుకంటే వీరు లాక్ డౌన్ సమయంలో అత్యవసరమైన ఎమర్జెన్సీ సేవల్లో ఉండటంతో వీరిపై ప్రభావం పడలేదు. మొత్తంగా 32 శాతం మంది రికవరీ కష్టమని, 29 శాతం మంది కోలుకోవడానికి 6 నెలలు పడుతుందన్నారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..



Click it and Unblock the Notifications