దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని, ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలు మినహాయించి ఎలాంటి కొత్త ప్రభుత్వ పథకాలు ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నూతన పథకాలు ఏవీ ప్రవేశపెట్టబోవడం లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

ఇతర పథకాలు మార్చి 31 వరకు నిలుపుదల
దేశంలో కరోనా విజృంభిస్తోందని నిర్మల సీతారామన్ గుర్తు చేశారు. ఆత్మనిర్భర్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అభియాన్ తదితర ప్రత్యేక పథకాలకు మాత్రమే నిధుల కేటాయింపు ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ పథకాల పరిధిలోకి రాని ఏ ఖర్చులు ఇయినా ఆదాయ, వ్యయ విభాగం అనుమతి పొందాలని సూచించారు. ఇప్పటికే బడ్జెట్ ఆమోదం పొందిన ఇతర పథకాలను తదుపరి ఉత్తర్వుల దాకా మార్చి 31, 2021 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కొత్త పథకాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తులు కూడా పంపవద్దని ఇతర మంత్రిత్వ శాఖలకు ఆర్థిక శాఖ సూచించింది.

పరిమిత నిధులు.. విచక్షణతో ఉపయోగించాలి
ప్రస్తుతం దేశంలో 2,27,273 కేసులు ఉన్నాయి. 6,367 మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ కరోనా కేసుల జాబితాలో ఏడో స్థానానికి చేరుకుంది. మరో ఏడువేలు దాటితే ఇటలీని దాటే అవకాశాలు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న లాక్ డౌన్ వంటి కఠిన చర్యల కారణంగా మిగతా దేశాలతో పోలిస్తే మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉంది. కానీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడి కోసం దీర్ఘకాలం కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖర్చులపై కోతలు విధిస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమితంగా ఉన్న వనరులను మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా విచక్షణతో వినియోగించాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ తెలిపింది. ఇందులో భాగంగా కొత్త పథకాలు ఏవీ ప్రకటించడం లేదని పేర్కొన్నారు.

కేంద్రం ప్యాకేజీ
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఖర్చులు పెరగడం, మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం రాకపోవడం కారణంగా రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ మినహా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇతర పథకాలు అమల్లోకి రావు. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీలో మే 17వ తేదీన ఆర్బీఐ రూ.8.01 లక్షల కోట్ల లిక్విడిటీ చర్యలు కూడా ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications