దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని, ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలు మినహాయించి ఎలాంటి కొత్త ప్రభుత్వ పథకాలు ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నూతన పథకాలు ఏవీ ప్రవేశపెట్టబోవడం లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

ఇతర పథకాలు మార్చి 31 వరకు నిలుపుదల
దేశంలో కరోనా విజృంభిస్తోందని నిర్మల సీతారామన్ గుర్తు చేశారు. ఆత్మనిర్భర్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అభియాన్ తదితర ప్రత్యేక పథకాలకు మాత్రమే నిధుల కేటాయింపు ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ పథకాల పరిధిలోకి రాని ఏ ఖర్చులు ఇయినా ఆదాయ, వ్యయ విభాగం అనుమతి పొందాలని సూచించారు. ఇప్పటికే బడ్జెట్ ఆమోదం పొందిన ఇతర పథకాలను తదుపరి ఉత్తర్వుల దాకా మార్చి 31, 2021 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కొత్త పథకాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తులు కూడా పంపవద్దని ఇతర మంత్రిత్వ శాఖలకు ఆర్థిక శాఖ సూచించింది.

పరిమిత నిధులు.. విచక్షణతో ఉపయోగించాలి
ప్రస్తుతం దేశంలో 2,27,273 కేసులు ఉన్నాయి. 6,367 మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ కరోనా కేసుల జాబితాలో ఏడో స్థానానికి చేరుకుంది. మరో ఏడువేలు దాటితే ఇటలీని దాటే అవకాశాలు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న లాక్ డౌన్ వంటి కఠిన చర్యల కారణంగా మిగతా దేశాలతో పోలిస్తే మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉంది. కానీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడి కోసం దీర్ఘకాలం కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖర్చులపై కోతలు విధిస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమితంగా ఉన్న వనరులను మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా విచక్షణతో వినియోగించాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ తెలిపింది. ఇందులో భాగంగా కొత్త పథకాలు ఏవీ ప్రకటించడం లేదని పేర్కొన్నారు.

కేంద్రం ప్యాకేజీ
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఖర్చులు పెరగడం, మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం రాకపోవడం కారణంగా రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ మినహా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇతర పథకాలు అమల్లోకి రావు. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీలో మే 17వ తేదీన ఆర్బీఐ రూ.8.01 లక్షల కోట్ల లిక్విడిటీ చర్యలు కూడా ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications