ఢిల్లీ: రూ.2000 నోట్లను నిలిపివేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ శనివారం లోకసభకు తెలిపింది. ప్రజల లావాదేవీల డిమాండ్ను సులభతరం చేయడానికి ఆర్బీఐని సంప్రదించి ప్రత్యేక విలువ కలిగిన బ్యాంకు నోట్ల ముద్రణను ప్రభుత్వం నిర్ణయిస్తుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో రూ.2000 నోట్లను ముద్రించని విషయం తెలిసిందే. అయితే ఈ నోట్ల ముద్రణను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

నోట్ల ముద్రణ అప్పుడు ఆపేశాం..
2019 మార్చి 31వ తేదీ నాటికి 27,398 లక్షల రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నట్లు తెలిపారు. అయితే 2019 మార్చి 31వ తేదీ నాటికి 32,910 లక్షల నోట్లు చలామణిలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా రూ.2000 నోట్ల ముద్రణ తాత్కాలికంగా నిలిచిపోయిందని చెప్పారు. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం నోట్ ప్రింటింగ్ను దశలవారీగా ప్రారంభించినట్లు తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రన్ ప్రయివేటు లిమిటెడ్(BRBNMPL)లో నోట్ల ముద్రణ కార్యకలాపాలు 2020 మార్చి 23వ తేదీ నుండి 2020 మే 23వ తేదీ వరకు నిలిపివేయబడిందని తెలిపారు. నోట్ల ముద్రణ తిరిగి మే 4వ తేదీ నుండి ప్రారంభమైందన్నారు.

ప్రింటింగ్ నిలిపివేత
కరోనా మహమ్మారి కారణంగా సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SPMCIL) తమ ముద్రణ కార్యక్రమాలపై ప్రభావం చూపిందని తెలిపారు. కరెన్సీ నోట్ ప్రెస్, నాషిక్ అండ్ బ్యాంకు నోట్ ప్రెస్ కరోనా కారణంగా నిలిచిపోయిందన,ి తిరిగి జూన్ నెలలో ప్రారంభమైనట్లు తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో సరఫరా
కరోనా లాక్ డౌన్ సమయంలో నోట్ ప్రింటింగ్ ప్రెస్లు ఆర్బీఐ కార్యాలయాలు, కరెన్సీ చెక్ పోస్టులకు భారతీయ రైల్వే ట్రెజరీ వ్యాగన్ల ద్వారా నోట్ల స్టాక్ నుండి నిరంతరాయంగా నోట్లను సరఫరా చేసినట్లు తెలిపారు. కాగా, రూ.2వేల నోట్లను క్రమంగా తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వార్తలు వచ్చాయి. దీనిపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications