కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా నెల రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతోంది. జనజీవనం స్తంభించిపోయింది. దీంతో రైతులు, కూలీలు, వలస కార్మికులు, ఉద్యోగులు ఉపాధి లేదా వేతనం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక వ్యవస్థలు నిలిచిపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం లేకుండా పోయింది. రెవెన్యూ భారీగా పడిపోయింది. కనీసం 5 నుండి 10 శాతం వసూలు అయ్యే పరిస్థితులు కూడా లేవు.

ఇటీవలి డీఏ పెంపుతో ఖజానాకు భారం
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో రెవెన్యూ భారీగా తగ్గిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపును నిలిపివేసింది. మార్చి 13వ తేదీన కేంద్రం ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA)ను 4 శాతం నుండి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీని వల్ల 2020-21ఆర్థిక సంవత్సరంలో ఖజానాకు 14,510 భారం పడుతోంది.

ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
కరోనా కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రాబడి తగ్గింది. దీంతో డీఏ అమలును ఆలస్యం చేయాలని కేంద్రం నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రానికి ఇది తప్పదు. అదే సమయంలో 1.13 కోట్ల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు బ్యాడ్ న్యూస్.

జూలై 2021 వరకు నిలిపివేత
కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు 2020 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఏఫ్రిల్ వేతనం సవరించిన డీఏ ప్రకారం రావాలి. జనవరి నుండి మార్చి వరకు బకాయిలు కూడా చెల్లించాల్సి ఉంది. డీఏ పెంపును వాయిదా వేసింది. జూలై 2021 వరకు పెంచిన డీఏను నిలిపివేసింది. 2020 జనవరి 1 నుండి 2021 జూన్ 30వ తేదీ వరకు డీఏ బకాయిల చెల్లింపు ఉండదని పేర్కొంది.

నోటిఫై కాలేదు
మార్చి 13వ తేదీన ఆమోదముద్రపడిన డీఏ పెంపును ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేయలేదు. సాధారణంగా దీనిని ఎప్పుడో చేయాలి. కానీ ఆ వెంటనే కరోనా కారణంగా మార్చి 24వ తేదీ నుండి లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో పన్నులు తగ్గి, నిధుల కొరత ఏర్పడింది. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా కాస్ట్ కట్టింగ్ చర్యలకు దిగింది.

ఆదాయం లేకపోవడంతో..
ఆదాయం లేకపోవడంతో కేంద్రం అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్లో 40 శాతం కోత విధించింది. ఇప్పుడు ఉద్యోగుల డీఏ వేతన పెంపును వాయిదా వేసింది. పెరిగిన డీఏ ఏప్రిల్ నుండి అమలవుతుందని ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశ మిగిలింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications