అబుజా: టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్పై భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా దుమారం చెలరేగుతోన్నట్టే కనిపిస్తోంది. ఆ సంస్థ యాజమాన్యం చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియ.. అనేక దేశాలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది. ఆ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్.. క్రమంగా తన పట్టును కోల్పోతోందనడానికి అద్దం పడుతున్నాయా వ్యవహారాలు. ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వినియోగిస్తోన్న వ్యక్తిగత ఖాతాకు చెందిన బ్లూ టిక్ను తొలగించడంపై భారత్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పలువురు బారతీయ జనతా పార్టీ నాయకులు ట్విట్టర్పై విమర్శలు చేస్తోన్నారు.
ఈ పరిస్థితిని భారత్ ఒక్కటే కాదు.. నైజీరియా కూడా ఎదుర్కొంటోంది. ట్విట్టర్ చర్యను నిరసిస్తూ ఆ దేశం ఏకంగా.. దాన్ని శాశ్వతంగా నిషేధించింది. ట్విట్టర్ సేవలను నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ పోస్టులను డిలేట్ చేయడాన్ని అక్కడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి వ్యక్తిగత అకౌంట్ బ్లూ టిక్ను తొలగించినట్టే ట్విట్టర్ యాజమాన్యం.. నైజీరియా అధ్యక్షుడు చేసిన కొన్ని పోస్టులను డిలేట్ చేసింది.

ఈ చర్య పట్ల అక్కడి ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ట్విట్టర్ సేవలను నిరవధికంగా సస్పెండ్ చేస్తోన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నైజీరియా సమాచార శాఖ మంత్రి అల్ హజీ లయ్ మహ్మద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ట్విట్టర్ డిలేట్ చేసిన ఆ పోస్ట్.. దేనికి సంబంధించిందనే విషయాన్ని వివరించలేదు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ ట్విట్టర్ సేవలు తమ దేశంలో అందుబాటులో ఉండబోవని స్పష్టం చేశారు. తమ దేశ కార్పొరేట్ చట్టాల ప్రకారం.. ట్విట్టర్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అలాగే- ఓటీటీ, సోషల్ మీడియా లైసెన్సింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి ఉంటుందని, దీనిపై ఓ సమగ్ర నివేదికను అందజేయాలంటూ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ కమిషన్ను ఆదేశించారు. ఇకపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తమ దేశంలో కార్యకలాపాలను కొనసాగించాలంటే.. తాము రూపొందించబోయే మార్గదర్శకాలు, విధి విధానాలకు లోబడి ఉండేలా మార్పులను చేయబోతోన్నట్లు తెలిపారు. ముహమ్మదు బుహారి ట్వీట్లను తొలగించడంపై ట్విట్టర్ యాజమాన్యం స్పందించింది. లోపం ఎక్కడ చోటు చేసుకుందనేది ఆరా తీస్తున్నామని తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications