అబుజా: టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్పై భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా దుమారం చెలరేగుతోన్నట్టే కనిపిస్తోంది. ఆ సంస్థ యాజమాన్యం చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియ.. అనేక దేశాలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది. ఆ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్.. క్రమంగా తన పట్టును కోల్పోతోందనడానికి అద్దం పడుతున్నాయా వ్యవహారాలు. ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వినియోగిస్తోన్న వ్యక్తిగత ఖాతాకు చెందిన బ్లూ టిక్ను తొలగించడంపై భారత్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పలువురు బారతీయ జనతా పార్టీ నాయకులు ట్విట్టర్పై విమర్శలు చేస్తోన్నారు.
ఈ పరిస్థితిని భారత్ ఒక్కటే కాదు.. నైజీరియా కూడా ఎదుర్కొంటోంది. ట్విట్టర్ చర్యను నిరసిస్తూ ఆ దేశం ఏకంగా.. దాన్ని శాశ్వతంగా నిషేధించింది. ట్విట్టర్ సేవలను నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ పోస్టులను డిలేట్ చేయడాన్ని అక్కడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి వ్యక్తిగత అకౌంట్ బ్లూ టిక్ను తొలగించినట్టే ట్విట్టర్ యాజమాన్యం.. నైజీరియా అధ్యక్షుడు చేసిన కొన్ని పోస్టులను డిలేట్ చేసింది.

ఈ చర్య పట్ల అక్కడి ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ట్విట్టర్ సేవలను నిరవధికంగా సస్పెండ్ చేస్తోన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నైజీరియా సమాచార శాఖ మంత్రి అల్ హజీ లయ్ మహ్మద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ట్విట్టర్ డిలేట్ చేసిన ఆ పోస్ట్.. దేనికి సంబంధించిందనే విషయాన్ని వివరించలేదు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ ట్విట్టర్ సేవలు తమ దేశంలో అందుబాటులో ఉండబోవని స్పష్టం చేశారు. తమ దేశ కార్పొరేట్ చట్టాల ప్రకారం.. ట్విట్టర్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అలాగే- ఓటీటీ, సోషల్ మీడియా లైసెన్సింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి ఉంటుందని, దీనిపై ఓ సమగ్ర నివేదికను అందజేయాలంటూ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ కమిషన్ను ఆదేశించారు. ఇకపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తమ దేశంలో కార్యకలాపాలను కొనసాగించాలంటే.. తాము రూపొందించబోయే మార్గదర్శకాలు, విధి విధానాలకు లోబడి ఉండేలా మార్పులను చేయబోతోన్నట్లు తెలిపారు. ముహమ్మదు బుహారి ట్వీట్లను తొలగించడంపై ట్విట్టర్ యాజమాన్యం స్పందించింది. లోపం ఎక్కడ చోటు చేసుకుందనేది ఆరా తీస్తున్నామని తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications