ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 12) కుప్పకూలాయి. కరోనా భయాలు పెరగడంతో సూచీలు నేడు క్షీణించాయి. కరోనా కేసులు రోజురోజుకు పెరగడం, మహారాష్ట్రలో బుధవారం నుండి లాక్ డౌన్ విధించనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ట్రేడింగ్ ఆరంభం నుండి మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ నేడు 1700 పాయింట్లకు పైగా నష్టాల్లో ముగియడంతో నేడు ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు తొమ్మిది శాతానికి పైగా కుంగిపోయాయి. ఆటో, ఎనర్జీ,ఇన్ఫ్రా, మెటల్ రంగ షేర్లు నాలుగు శాతం నుండి ఐదు శాతం నష్టపోయాయి.

సూచీలు పతనం
సెన్సెక్స్ నేడు ఉదయం 48,956.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,956.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 47,693.44 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్లో 49,591 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు ఏ సమయంలోను నిన్నటి మార్కును తాకలేదు. చివరకు 1,707.94 (3.44%) పాయింట్లు నష్టపోయి 47,883.38 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,644.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,652.50 వద్ద గరిష్టాన్ని, 14,248.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 524.05 (3.53%) పాయింట్లు నష్టపోయి 14,310.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

అందుకే మార్కెట్ పతనం
నేడు రికార్డ్ స్థాయిలో 1.69 లక్షల కరోనా కేసులు నమోదు కావడంతో మార్కెట్లు బెంబేలెత్తాయి. ప్రపంచంలోని ప్రతి ఆరు కేసుల్లో ఒకటి భారత్లో నమోదుకావడం ఆందోళనకు కారణమైంది. 2021లో ఇది అత్యధికం. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఇవి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించే విషయంలో బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు వచ్చిన వార్తలు ఇన్వెస్టర్లను భయానికి గురి చేశాయి. ఆసియా మార్కెట్లు కూడా పతనమయ్యాయి. ఈ ప్రభావం కూడా పడింది.

FPIలు వెనక్కి
ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు FPI ఇన్వెస్టర్లు దాదాపు రూ.929 కోట్లను నికరంగా విక్రయించారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి పింజుకోవడంపై ఆందోళనలు నెలకొన్నాయి. 9వ తేదీ వరకు ఈక్విటీల నుండి రూ.740 కోట్లు, డెట్ మార్కెట్ నుండి రూ.189 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. లాక్ డౌన్ విధిస్తే ఎన్పీఏలు మరింత పెరుగుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను భయానికి గురి చేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications