జాయింట్ వెంచర్స్: FDI నిబంధనలు మరింత సులభతరం!
ప్రపంచంతో పాటు దేశంలోని ఆర్థిక మందగమనం పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పెట్టుబడులు ఆశించినంతగా లేవు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI-foreign direct investment) కొత్త నిబంధనలు కాస్త సులభతరంగా ఉండనున్నాయట. ఇండియన్ కంపెనీల జాయింట్ వెంచర్స్కు సంబంధించి FDI నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సులభతరం చేయనుందని వార్తలు వస్తున్నాయి. తద్వారా విదేశీ నిధులు పెద్ద ఎత్తున వస్తాయని అంచనా వేస్తోంది.
మోడీ ప్రభుత్వం FDI ఎఫెక్ట్, భారత్లో యాపిల్ సొంత ఆన్లైన్ స్టోర్
చట్టబద్దమైన వ్యాపార కార్యకలాపాలలో విదేశీ నిధుల ప్రవాహాన్ని సులభతరం చేసేందుకు గాను జాయింట్ వెంచర్స్ (JVs) లేదా భారతీయ కంపెనీ యాజమాన్యంలోని అనుబంధ సంస్థల (WOS) నిబంధనలు సరళతరం చేయనుందట.
FEMA ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా ఓ భారతీయ సంస్థకు విదేశీ జాయింట్ వెంచర్ లేదా WOS ద్వారా ఎఫ్డీఐలను అనుమతించరు. అలాగే, భారత్లో ఇప్పటికే ఎఫ్డీఐ పెట్టుబడులు కలిగి ఉన్న విదేశీ సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను చేపట్టేందుకు భారతీయ సంస్థలపై ఆంక్షలు ఉన్నాయి.
ఇప్పటికే ఉన్న పరిమితుల్లో మార్పులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. అనుమతులు సులభతరం చేయడం, అలాంటి పెట్టుబడులు ఆటో మేటిక్గా (ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా) వచ్చేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలలో మార్పులు చేయనున్నట్లు చెప్పారని తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. భారత్లోను అదే పరిస్థితి. పెట్టుబడులు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ మార్పులు తప్పనిసరి అంటున్నారు.
ఎగుమతులు పెంపు అంశంపై ఆర్థిక నిపుణులు సుర్జీతి భల్లా నేతృత్వంలో హై లెవల్ అడ్వైజరీ గ్రూప్ (HLAG) నివేదిక తయారు చేసింది. ఇందులో భాగంగా ఈ కమిటీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా పలు సూచనలు చేసింది. సంబంధిత ఎఫ్డీఐ నిబంధనల మార్పు విషయమై డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) కూడా పని చేస్తోందని చెబుతున్నారు.