ప్రపంచంతో పాటు దేశంలోని ఆర్థిక మందగమనం పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పెట్టుబడులు ఆశించినంతగా లేవు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI-foreign direct investment) కొత్త నిబంధనలు కాస్త సులభతరంగా ఉండనున్నాయట. ఇండియన్ కంపెనీల జాయింట్ వెంచర్స్కు సంబంధించి FDI నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సులభతరం చేయనుందని వార్తలు వస్తున్నాయి. తద్వారా విదేశీ నిధులు పెద్ద ఎత్తున వస్తాయని అంచనా వేస్తోంది.
చట్టబద్దమైన వ్యాపార కార్యకలాపాలలో విదేశీ నిధుల ప్రవాహాన్ని సులభతరం చేసేందుకు గాను జాయింట్ వెంచర్స్ (JVs) లేదా భారతీయ కంపెనీ యాజమాన్యంలోని అనుబంధ సంస్థల (WOS) నిబంధనలు సరళతరం చేయనుందట.

FEMA ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా ఓ భారతీయ సంస్థకు విదేశీ జాయింట్ వెంచర్ లేదా WOS ద్వారా ఎఫ్డీఐలను అనుమతించరు. అలాగే, భారత్లో ఇప్పటికే ఎఫ్డీఐ పెట్టుబడులు కలిగి ఉన్న విదేశీ సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను చేపట్టేందుకు భారతీయ సంస్థలపై ఆంక్షలు ఉన్నాయి.
ఇప్పటికే ఉన్న పరిమితుల్లో మార్పులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. అనుమతులు సులభతరం చేయడం, అలాంటి పెట్టుబడులు ఆటో మేటిక్గా (ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా) వచ్చేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలలో మార్పులు చేయనున్నట్లు చెప్పారని తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. భారత్లోను అదే పరిస్థితి. పెట్టుబడులు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ మార్పులు తప్పనిసరి అంటున్నారు.
ఎగుమతులు పెంపు అంశంపై ఆర్థిక నిపుణులు సుర్జీతి భల్లా నేతృత్వంలో హై లెవల్ అడ్వైజరీ గ్రూప్ (HLAG) నివేదిక తయారు చేసింది. ఇందులో భాగంగా ఈ కమిటీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా పలు సూచనలు చేసింది. సంబంధిత ఎఫ్డీఐ నిబంధనల మార్పు విషయమై డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) కూడా పని చేస్తోందని చెబుతున్నారు.
More From GoodReturns

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications