భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ వెల్లడించింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తగా నిలిచిపోయి 2020లో జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 23.9 శాతం క్షీణించింది. అయితే అన్-లాక్ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయి. దీంతో పూర్తి సంవత్సరానికి జీడీపీని మూడీస్ సవరించింది. గతంలో కంటే కాస్త ఆశాజనకంగా పేర్కొంది.

9.6 శాతం నుండి 8.9 శాతానికి...
లాక్ డౌన్ నేపథ్యంలో 2020లో భారత జీడీపీ భారీగా తగ్గుతుందని గతంలో అంచనా వేసిన మూడీస్ తాజాగా ఆ గణాంకాలను సవరించింది. గ్లోబల్ మాక్రో అవుట్ లుక్ 20201-22 పేరుతో రూపొందించిన నివేదికలో ఈ ఏడాది జీడీపీ మైనస్ 8.9 శాతం క్షీణత నమోదు చేయవచ్చునని మూడీస్ అంచనా వేసింది. గతంలో మైనస్ 9.6 శాతంగా పేర్కొంది. గత అంచనాతో పోలిస్తే తాజా అంచనా మెరుగు. అంటే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

వచ్చే ఏడాది మరింత వృద్ధి
2021 క్యాలెండర్ ఏడాదిలో జీడీపీ వృద్ధి రేటు 8.6 శాతంగా ఉండవచ్చునని మూడీస్ అంచనా వేసింది. గతంలో దీనిని 8.1 శాతంగా పేర్కొంది. అంటే వచ్చే ఏడాది వృద్ధి రేటు కూడా గత అంచనాల కంటే మెరుగ్గా అంచనా వేసింది. 2019లో భారత్ జీడీపీ వృద్ధి 4.8 శాతంగా నమోదయింది. దేశంలో రెండు నెలలకు పైగా సుదీర్ఘ లాక్ డౌన్ విధించారు. దీంతో ఈ ఏడాది మొత్తానికి వృద్ధి రేటు ప్రతికూలంగా ఉంటుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. డిసెంబర్ వరకు ప్రతి త్రైమాసికం ప్రతికూలంగానే ఉంటుందని చెబుతున్నారు.

భారీ ప్యాకేజీ...
జీ-20 ఆర్థిక వ్యవస్థల విషయానికి వస్తే 2020లో 3.8 శాతం క్షీణత నమోదు కావొచ్చునని, 2021లో 4.9 శాతం, 2022లో 3.8 శాతం మేర వృద్ధి నమోదు కావొచ్చునని మూడీస్ అంచనా వేసింది. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు రూ.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇది జీడీపీలో 15 శాతం. ప్రభుత్వం చర్యలు భారత వృద్ధిని వేగంగా పట్టాలు ఎక్కించే విధంగా కనిపిస్తోందని అంటున్నారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications