భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ వెల్లడించింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తగా నిలిచిపోయి 2020లో జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 23.9 శాతం క్షీణించింది. అయితే అన్-లాక్ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయి. దీంతో పూర్తి సంవత్సరానికి జీడీపీని మూడీస్ సవరించింది. గతంలో కంటే కాస్త ఆశాజనకంగా పేర్కొంది.

9.6 శాతం నుండి 8.9 శాతానికి...
లాక్ డౌన్ నేపథ్యంలో 2020లో భారత జీడీపీ భారీగా తగ్గుతుందని గతంలో అంచనా వేసిన మూడీస్ తాజాగా ఆ గణాంకాలను సవరించింది. గ్లోబల్ మాక్రో అవుట్ లుక్ 20201-22 పేరుతో రూపొందించిన నివేదికలో ఈ ఏడాది జీడీపీ మైనస్ 8.9 శాతం క్షీణత నమోదు చేయవచ్చునని మూడీస్ అంచనా వేసింది. గతంలో మైనస్ 9.6 శాతంగా పేర్కొంది. గత అంచనాతో పోలిస్తే తాజా అంచనా మెరుగు. అంటే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

వచ్చే ఏడాది మరింత వృద్ధి
2021 క్యాలెండర్ ఏడాదిలో జీడీపీ వృద్ధి రేటు 8.6 శాతంగా ఉండవచ్చునని మూడీస్ అంచనా వేసింది. గతంలో దీనిని 8.1 శాతంగా పేర్కొంది. అంటే వచ్చే ఏడాది వృద్ధి రేటు కూడా గత అంచనాల కంటే మెరుగ్గా అంచనా వేసింది. 2019లో భారత్ జీడీపీ వృద్ధి 4.8 శాతంగా నమోదయింది. దేశంలో రెండు నెలలకు పైగా సుదీర్ఘ లాక్ డౌన్ విధించారు. దీంతో ఈ ఏడాది మొత్తానికి వృద్ధి రేటు ప్రతికూలంగా ఉంటుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. డిసెంబర్ వరకు ప్రతి త్రైమాసికం ప్రతికూలంగానే ఉంటుందని చెబుతున్నారు.

భారీ ప్యాకేజీ...
జీ-20 ఆర్థిక వ్యవస్థల విషయానికి వస్తే 2020లో 3.8 శాతం క్షీణత నమోదు కావొచ్చునని, 2021లో 4.9 శాతం, 2022లో 3.8 శాతం మేర వృద్ధి నమోదు కావొచ్చునని మూడీస్ అంచనా వేసింది. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు రూ.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇది జీడీపీలో 15 శాతం. ప్రభుత్వం చర్యలు భారత వృద్ధిని వేగంగా పట్టాలు ఎక్కించే విధంగా కనిపిస్తోందని అంటున్నారు.
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications