Mood of the Nation: మోడీ హయాంలో మరింత ఈజీగా బిజినెస్
నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారత్లో బిజినెస్ చాలా సులభంగా మారిందని 49 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే - కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 12,141 మంది పాల్గొన్నారు. మోడీ హయాంలో బిజినెస్ ఎలా ఉందనే అంశంపై వారిలో ఎక్కువ మంది సానుకూలంగా స్పందించారు.
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 49 శాతం మంది మోడీ హయాంలో బిజినెస్ సులభంగా మారిందని చెప్పగా, 39 శాతం మంది లేదని అభిప్రాయపడ్డారు. 15 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. గత ఏడాది ఆగస్ట్ నెలలోను ఇలాంటి సర్వే నిర్వహించారు. అప్పుడు 54 శాతం మంది మోడీ హయాంలో బిజినెస్ సులభంగా మారిందని పేర్కొన్నారు. 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
Mood of the Nation సర్వే: మందగమనం-ఉల్లి ధర.. 62% మందిది ఇదే మాట
2019 ఏడాదిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 190 దేశాలకు గాను భారత్ 14 ర్యాంకులు మెరుగుపరుచుకొని 63వ ర్యాంకుకు చేరుకుంది. ఇటీవల మందగమనం కారణంగా కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. వ్యాపార సౌలభ్యం పెంచేందుకు వివిధ సంస్కరణలు చేపట్టింది.