Subsidy On Drones: దేశంలో వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ డ్రోన్లకు భారీగా సబ్సిడీ అందించేందుకు ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.

చిన్న రైతులు..
పంటలకు ఎరువులతో పాటు ఇతర రసాయనాలను సులభంగా పిచికారీ చేసేందుకు డ్రోన్ల వినియోగం పెరిగింది. మన దేశంలో చిన్నసన్నకారు రైతుల సంఖ్య ఎక్కువ. మారుతున్న అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రికీకరణ అనివార్యంగా మారింది. అందుకే చిన్న రైతుల ప్రోత్సాహకానికి, వారికి మెరుగైన ఆదాయాన్ని అందించేందుకు మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది.

డ్రోన్ల వినియోగం..
డ్రోన్ కెమెరాలను కేవలం రసాయనాల పితికారీకి మాత్రమే కాక.. పొలంపై ఓ కన్నేసి ఉంటేందుకు కూడా వినియోగించవచ్చు. రైతులకు వ్యవసాయంలో ఉపయోగపడే డ్రోన్లపై 50 శాతం అంటే దాదాపు రూ.5 లక్షల కవర్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం వ్యవసాయ అవసరాల కోసం కొనుగోలు చేసిన డ్రోన్లపై రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది.

నూతన వ్యవసాయానికి..
దేశంలోని రైతులను నూతన వ్యవసాయ సాంకేతికతల వైపు నడిపేందుకు.. తక్కువ సమయం, పెట్టుబడితో మంచి దిగుబడి, ఆర్థిక ఫలితాలను పొందేందుకు రైతులను సమకాలీకరించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం సహాయపడుతుందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

సబ్సిడీకి అర్హతలు..
కేంద్రం తెచ్చిన డ్రోన్ సబ్సిడీ స్కీమ్ కి సన్నకారు రైతులు, ఈశాన్య రాష్ట్రాల రైతులు, మహిళా రైతులు గరిష్ఠంగా డ్రోన్ ధరలో 50 శాతం లేదా రూ.5 లక్షల వరకు పొందేందుకు అర్హులు. ఇతర రైతులు మాత్రం డ్రోన్పై రూ.4 లక్షల వరకు లేదా డ్రోన్ ధరలో 40 శాతం వరకు సబ్సిడీని పొందవచ్చు. డ్రోన్లను UAVలు అని పిలుస్తారు. అంటే ఇవి మానవరహిత వైమానిక వాహనాలని అర్ధం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications