మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ 'గ్రో'లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్ చేశారు. కంపెనీకి సలహాలు కూడా ఇస్తారు. ఈ మేరకు 'గ్రో' కో-ఫౌండర్ అండ్ సీఈవో లలిత్ కెష్రే సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ''గ్రో'లో ప్రపంచ బెస్ట్ సీఈవో ఇన్వెస్ట్ చేశారు. అలాగే అడ్వైజర్గా ఉన్నారు. భారత్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ యాక్సెసబులిటీ కోసం సత్య నాదెళ్ల తమతో చేరినందుకు ఆనందంగా ఉంది.' అని పేర్కొన్నారు. 2021లో గ్రో రెండుసార్లు ఫండ్ రైజ్ చేసింది. ఇందులో భాగంగా సత్య నాదెళ్ల ఇన్వెస్ట్ చేశారు.
గ్రో కంపెనీ మొదటిసారి 1 బిలియన్ డాలర్ల వద్ద ఏప్రిల్ నెలలో 83 మిలియన్ డాలర్లను సమీకరించింది. రెండోసారి అక్టోబర్ నెలలో 3 బిలియన్ డాలర్ల వద్ద 251 మిలియన్ డాలర్లను సమీకరించింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోవడం, ఆరోగ్యపరమైన ఆందోళనలతో ప్రజల ఆలోచన ధోరణిలో మార్పులు చోటు చేసుకున్నాయి.

పెట్టుబడులు పెట్టడం, పొదుపుపై దృష్టిసారించే వారి సంఖ్య పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కంపెనీల తొలి పబ్లిక్ ఇష్యూల్లోను పెట్టుబడులు పెట్టడానికి రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ అంశాలు గ్రో వంటి కంపెనీల వినియోగదారులు పెరిగేందుకు దోహదపడుతున్నాయి.
గ్రో కంపెనీ తన వ్యాపార వృద్ధి మూలంగా ప్రపంచ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఫ్లిప్ కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్స్ అయిన లలిత్ కెష్రే, హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సాల్ 2016లో గ్రో ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఐపీఓలు, యూఎస్ స్టాక్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, గోల్డ్ వంటి వాటిలో యూజర్లు పెట్టుబడులు పెట్టేందుకు సహకరిస్తుంది. తన ప్లాట్ఫామ్ వినియోగదారుల సంఖ్య రెండు కోట్లకు పైగా ఉందని కంపెనీ తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications