న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వేల కోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ కేసు వ్యవహారం.. అనూహ్య మలుపు తిరిగింది. ఆయనకు బెయిల్ ఇవ్వడానికి డొమినికా హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో- భారత అత్యున్నత దర్యాప్తు సంస్థ.. సీబీఐ ఎంటర్ అయింది. ఈ కేసులో ఇంప్లీడ్ కావడానికి అనుమతి ఇవ్వాలంటూ అభ్యర్థించింది. ఈ మేరకు ఓ అఫిడవిట్ను దాఖలు చేసింది. బెయిల్ కోసం మేహుల్ చోక్సీ తరఫు న్యాయవాది వేసిన పిటీషన్ను డొమినికా హైకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల వ్యవధిలోనే చోటు చేసుకున్న కీలక పరిణామం ఇది.

అఫిడవిట్లో కీలక విషయాలు..
సీబీఐ.. తాను దాఖలు చేసిన అఫిడవిట్లో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. మేహుల్ చోక్సీ బండారం మొత్తాన్నీ అందులో పొందుపరిచింది. 13,500 కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో వెనుక చోక్సీ హస్తం ఉందని స్పష్టం చేసింది. ఆయనే దీనికి మాస్టర్మైండ్ అని కుండబద్దలు కొట్టింది. ఈ కేసులో ఇంప్లీడ్ కావడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టను విజ్ఞప్తి చేసింది. బ్యాంకు అధికారుల నుంచి లెటర్స్ టు అండర్టేకింగ్ (ఎల్ఓయు)లను సాధించడానికి తప్పుడు పత్రాలను సమర్పించారని, బ్యాంక్ అధికారులతో కుట్ర పన్నారని పేర్కొంది. ఆయన కోసం తమతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేసింది.

బ్యాంకు నిబంధనలకు తూట్లు..
డమ్మీ కంపెనీలను సృష్టించడం ద్వారా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎల్ఓయులను చోక్సీ సంపాదించాడని, వాటి ద్వారా బ్యాంకులను మోసం చేశారని తెలిపింది. ఈ విషయంలో బ్యాంకు నిబంధనలకు తూట్లు పొడిచినట్లు ఆరోపించింది. చోక్సీ పరారీలో ఉన్న అంతర్జాతీయ స్థాయి ఆర్ధిక నేరస్తుడని వ్యాఖ్యానించింది. ఆయనను అరెస్ట్ చేయడానికి తాము సుదీర్ఘకాలం నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నామని, ఆచూకీ తెలియరాలేదని స్పష్టం చేసింది. 2018 ఏప్రిల్ 17వ తేదీన భారత న్యాయస్థానం కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసినట్లు తెలిపింది.

చోక్సీ కోసం రెడ్ కార్నర్ నోటీస్
మేహుల్ చోక్సీ కోసం ఇంటర్పోల్ కూడా అన్వేషణ సాగిస్తోందని, ఆయన కోసం ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ను జారీ చేసిందని సీబీఐ డొమినికా హైకోర్టుకు గుర్తు చేసింది. ఈ కేసులో తాము ఇంప్లీడ్ కావడం వల్ల చోక్సీని అరెస్ట్ చేయడానికి చట్టపరమైన అనుమతి దొరుకుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఈ పరిణామాలన్నింటిలో తాము ఇంప్లీడ్ కావడం వల్ల చోక్సీని అరెస్ట్ చేయడానికి వీలు కలుగుతుందని అభిప్రాయపడింది. అలాగే- చోక్సీని నేరుగా భారత్కు అప్పగించాలంటూ ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రధానమంత్రి సైతం చేసిన ప్రకటనను సీబీఐ తన అఫిడవిట్లో పొందుపరిచింది.

డొమినికా ఆసుపత్రిలో
మేహుల్ చోక్సీకి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది, ఆంటిగ్వాకు చెందిన వేన్ మార్ష్ దాఖలు చేసిన పిటీషన్ను తాజాగా హైకోర్టు తిరస్కరించింది. జైల్లో ఉండగా అనారోగ్యానికి గురైన చోక్సీని రొస్సోలోని డొమినికా-చైనా ఫ్రెండ్షిప్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు అధికారులు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. ఆంటిగ్వా నుంచి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాడనే కారణంతో డొమినికా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. హైకోర్టు ముందు ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు పోలీసు కస్టడీకి అప్పగించింది. చోక్సీని క్యారికామ్ (కరేబియన్ కమ్యూనిటీ)కి చెందిన పౌరుడిగా గుర్తించాలని, ఈ కారణంతో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ వేన్ మార్ష్ ఈ పిటీషన్ దాఖలు చేశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications