కరోనా మహమ్మారి-లాక్ డౌన్తో చితికిపోయిన రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. నిర్మాణ, సేవల కాంట్రాక్టులకు ఆరు నెలల వరకు వెసులుబాటు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆత్మనిర్భర్ భాత్ అభియాన్ వివరాలను నిర్మల వెల్లడించారు. కేంద్రం ఏజెన్సీల కాంట్రాక్టు పనుల పూర్తికి ఆరు నెలల అదనపు సమయం ఇస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు కాంట్రాక్టర్ల బ్యాంకు గ్యారంటీలను పాక్షికంగా విడుదల చేయవచ్చునని తెలిపారు. పనులు పూర్తయిన స్థాయిని బట్టి బ్యాంకు గ్యారంటీలను పాక్షికంగా విడుదల చేయాలన్నారు. ఈ వెసులుబాటు వల్ల కాంట్రాక్టర్లకు నిధుల లభ్యత కొరత కొంత వరకు తగ్గుతుందని తెలిపారు.
కరోనా సమయాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్గా చూడాలని నిర్మల తెలిపారు. ఈ మేరకు ప్రాజెక్టు ఒప్పందాల అమలుకు సంబంధించి మార్పులు సూచిస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు కూడా ఈ సందర్భంగా భారీ ఊరట కల్పించిన విషయం తెలిసిందే.

ఎంఎస్ఎంఈలకు 12 నెలల మారటోరియంతో రూ.3 లక్షల కేటాయించినట్లు తెలిపారు. నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని తెలిపారు. తద్వారా ఎంఎస్ఎంఈ ఉద్యోగులకు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈలలో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.50వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యం కోసం రూ.10వేల కోట్లు కేటాయించారు. శక్తి, సామర్థ్యం, ఉన్న ఎంఎస్ఎంఈలతో పాటు ఎన్పీఏ ముప్పు ఎదుర్కొనే సంస్థలు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. అలాగే రూ.200 కోట్లలోపు కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్స్ అవకాశం లేదని తెలిపారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications