మారుతీ సుజుకీ వివిధ మోడల్స్ కార్ల ధరలను పెంచనుంది. ఈ మేరకు మంగళవారం మారుతీ సుజుకీ ఇండియా ప్రకటన చేసింది. ఇన్పుట్ ఖర్చులు పెరిగినందువల్ల జనవరి 2020 నుంచి ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే ఆయా కార్ల ధరలు ఎంత పెరుగుతాయనే అంశాన్ని పేర్కొనలేదు. మారుతీ సుజుకీ ఇండియా తన ఎరీనా, నెక్సా ఛానల్స్ ద్వారా వాహనాలు విక్రయిస్తుంది.
తన ఎరీనా డీలర్షిప్స్ ద్వారా Alto, WagonR, Celerio, S-Presso, Swift, Dzire, Vitara Brezza, Ertiga, Eecoలను విక్రయిస్తుంది. నెక్సా డీలర్షిప్స్ ద్వారా Ignis, Baleno, Ciaz, S-Cross, XL6 కార్లను విక్రయిస్తోంది.
గత సంవత్సర కాలంగా ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ వాహనాల ధరపై ప్రతికూల ప్రభావం పడుతోందని, దీని వల్ల ధరలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా రెగ్యులేటరీ పైలింగ్లో తెలిపింది.

అందుకే జనవరి 2020 నుంచి వివిధ మోడల్స్ ధరలు పెరుగుతున్నాయని, ఖర్చుల పెరుగుదలను కొంత మొత్తం కస్టమర్ల పైన మోపవలసి వస్తుందని పేర్కొంది. ఈ ధరల పెరుగుదల వేర్వేరు మోడల్స్కు వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది.
2019లో ఇప్పటి వరకు మారుతీ సుజుకీ ఇండియా సేల్స్ మంత్లీ వైజ్ రెండుసార్లు పెరిగాయి. అక్టోబర్ నెలలో 4.5 శాతం, జనవరిలో 0.2 శాతంగా ఉన్నాయి. మిగతా నెలల్లో సేల్స్ తగ్గాయి. నవంబర్ నెలలో 1.9 శాతం, సెప్టెంబర్లో 24.4 శాతం, ఆగస్ట్లో 32.7 శాతం, జూలైలో 33.5 శాతం, జూన్లో 14 శాతం, మేలో 22 శాతం, ఏప్రిల్లో 17.2 శాతం, మార్చిలో 1.6 శాతం ఫిబ్రవరిలో 0.8 శాతం తగ్గాయి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications