దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో అన్ని మోడల్స్ ధరలను పెంచుతామని వెల్లడించింది. ఉక్కుతో పాటు వాహన తయారీలో కీలకమైన వివిధ ఉత్పత్తుల ధరలు పెరిగాయని, అందుకే ధరల పెంపు తప్పడం లేదని మారుతీ సుజుకీ సంస్థ సేల్స్, మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.
ఇంతకుముందు ఏప్రిల్ నెలలో వాహన ధరలు పెంచింది మారుతీ. ఆల్టో నుండి ఎస్ క్రాస్ వరకు వివిధ మోడల్స్ను మారుతీ విక్రయిస్తోంది. ఢిల్లీ ఎక్స్-షోరూం ప్రకారం వీటి ధరల శ్రేణి కనిష్ఠంగా రూ.3 లక్షలు, గరిష్ఠంగా రూ.12.39 లక్షలుగా ఉన్నాయి. ఇన్పుట్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో జూలై-సెప్టెంబర్ త్రైమాసికం నుండి మరోసారి ధరలు పెంచుతున్నట్లు తెలిపింది.

స్టీల్ సహా కార్ల ఉత్పత్తికి అవసరమైన పలు కమోడిటీ ధరలు గణనీయంగా పెరిగాయని, దీంతో కొంత భారాన్ని కస్టమర్ల పైకి బదిలీ చేయక తప్పడం లేదని మారుతీ చెబుతోంది. ఏ మోడల్ పైన ఎంత పెంచేదీ ఇంకా వెల్లడించలేదు. పెంపు పైన అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో కంపెనీ కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications