మహీంద్రా లాభాల్లో తిరోగమనం .. ఆ యూనిట్ దివాలానే కారణం!!
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మూడవ త్రైమాసిక లాభంలో తిరోగమనాన్ని నమోదు చేసింది . కార్ల తయారీ దిగ్గజం తన దక్షిణ కొరియా యూనిట్ సాంగ్యాంగ్ మోటార్పై నష్టాన్ని నివేదించింది, ఇది దివాలా కోసం దాఖలు చేసింది. దీంతో మూడవ త్రైమాసిక లాభంలో తిరోగమనాన్ని నమోదు చేసిన సంస్థ లాభాలలో క్షీణతను చూసింది.
నిరాశాజనక త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించిన మహీంద్రా అండ్ మహీంద్రా
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా నిరాశాజనక త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. డిసెంబర్ తో ముగిసిన మూడు నెలల కాలానికి గాను సంస్థ 159. 60 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని మాత్రమే ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంతో పోలిస్తే ఇది దాదాపు ఆరు శాతం పడిపోయింది . అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సంస్థ 170 .69 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది.
సాంగ్ యాంగ్ మోటర్ కంపెనీతో సంస్థకు 1938 కోట్ల రూపాయల నష్టం.. దివాలాకు దాఖలు
సమీక్షా కాలంలో కన్సాలిడేటెడ్ ఆదాయం పెరిగినట్లు బీఎస్ఈ కి సమాచారం అందించింది. సాంగ్ యాంగ్ మోటర్ కంపెనీతో సంస్థకు 1938 కోట్ల రూపాయల నష్టం రావడంతో సాంగ్యాంగ్లో తన వాటాను విక్రయించడానికి చర్చలు జరుపుతోంది.అంతేకాదు దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ డిసెంబరులో ప్రీ-ప్యాకేజ్డ్ పునరావాస దివాలా ప్రణాళిక కోసం దాఖలు చేసిందని మహీంద్రా ఒక ప్రకటనలో తెలిపింది. సాంగ్ యాంగ్ కు సంబంధించి 21,210 కోట్ల నష్టం వాటిల్లుతుందని మహీంద్రా అంచనా వేసింది . అందుకే దివాలా పిటీషన్ దాఖలు చేసింది .
మహీంద్రా మూడో క్వార్టర్ ఫలితాలపై సంస్థ రిపోర్ట్
దివాలా ప్రణాళిక ఆమోదం పొందిన తరువాత, కోర్టు పునరావాస చర్యలను ప్రారంభిస్తుంది . సంస్థ యొక్క వ్యవహారాల నిర్వహణకు రిసీవర్ను నియమిస్తుంది అని మహీంద్రా చెప్పారు.డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికంలో పన్ను తర్వాత లాభం 30.93 కోట్ల రూపాయలు కాగా, అంతకు ముందు సంవత్సరం 307 కోట్ల రూపాయలని మహీంద్రా వెల్లడించింది. ఏదేమైనా, మహీంద్రా యొక్క స్వతంత్ర ఫలితాలు దాని ఉత్పాదక విభాగంతో కలిపి మూడవ త్రైమాసికంలో 531 కోట్ల డాలర్ల పన్ను తర్వాత లాభానికి అనువదించాయి. ఇది అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికం నుండి 40 శాతం పెరిగింది.