ముంబై: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజలపై మరోసారి ధరల కొరడా ఝుళిపించడం మొదలు పెట్టింది. ఇప్పటికే గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల ధరల మోత మోగించింది. ఒక్కో సిలిండర్ రీఫిల్లింగ్పై 50 రూపాయల అదనపు భారాన్ని మోపింది. పెట్రోల్, డీజిల్ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పేరుతో ఇంధన రేట్లను భారీగా పెంచుకుంటూ పోతోంది.

మెడిసిన్స్పైన బాదుడు..
అయిదు రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగుసార్లు పెరిగాయి. ఈ నాలుగు దఫాల్లోనూ కేంద్ర ప్రభుత్వం లీటర్పై 80 పైసల చొప్పున పెంచుకుంటూ పోయింది. మొత్తంగా వాహనదారులు లీటర్పై రూ.3.20 పైసలను అధికంగా చెల్లించాల్సి వస్తోంది. మెడిసిన్స్పైనా ధరల భారాన్ని మోపింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే 800 రకాల మందులపై వడ్డనకు రంగం సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆయా రకాల మందులపై 10.7 శాతం వరకు ధరలను పెంచేలా చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పెరుగుదల వర్తిస్తుంది.

సీఎన్జీపైనా..
దీని ప్రభావంతో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సైతం తన ధరలను పెంచింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్ గ్యాస్పై రేట్లను పెంచింది. సీఎన్జీ కేజీ ఒక్కింటికి రూ. 59.01 పైసలు, పీఎన్జీ 36.61 రూపాయలకు చేరింది. స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ మీద ఈ మొత్తాన్ని వసూలు చేస్తామని ప్రకటించింది ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. ధరల పెరుగుదల విపరీతంగా పెరిగిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

వ్యాట్ తగ్గించిన మహారాష్ట్ర
సీఎన్జీ రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. దీనిపై వసూలు చేస్తోన్న విలువ ఆధిరత పన్ను (వ్యాట్)ను భారీగా తగ్గించనుంది. ప్రస్తుతం సీఎన్జీ మీద మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సర్కార్ 13.5 శాతం మేర వ్యాట్ను వసూలు చేస్తోంది. దీన్ని మూడు శాతానికి తగ్గిస్తామని ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అజిత్ పవార్.. అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. ఈ తగ్గింపు వల్ల ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం 800 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడుతుందని చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి తగ్గింపు వర్తిస్తుందని వివరించారు.

ప్రత్యామ్నాయానికి ప్రోత్సాహం..
పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అజిత్ పవార్ పేర్కొన్నారు. సీఎన్జీ మీద వ్యాట్ను తగ్గించడం వల్ల పెట్రోల్, డీజిల్ వాహనదారులు సీఎన్జీకి మారుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లు, ప్యాసింజర్ వాహనాలకు తమ నిర్ణయం మేలు కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందుకే- వాహనదారులు ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications