LIC: దేశీయ ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. దేశంలోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు సైతం మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ఈ విషయాన్నే అస్త్రంగా మార్చుకున్నారు. ఈ క్రమంలో అదానీ పతనం వల్ల ఎల్ఐసీ షేర్లు సైతం ప్రభావితమై విలువను కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే.

పెట్టుబడుల విలువ..
లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల్లో గత కొన్ని సంవత్సరాలుగా మెుత్తం రూ.30,127 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు ఎల్ఐసీ వెల్లడించింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరల్లో భారీ అస్థిరతల నేపథ్యంలో నేడు ఒక వివరణను జారీ చేసింది. జనవరి 27 నాటి ముగింపు ధర ఆధారంగా అదానీ కంపెనీల్లో పెట్టుబడుల మార్కెట్ విలువ రూ.56,142 కోట్లుగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

IRDAI నిబంధనల ప్రకారం..
మెుత్తం అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో కేవలం 0.975 శాతమని ఎల్ఐసీ వెల్లడించింది. ఎల్ఐసీ అదానీ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉన్నాయని ఎల్ఐసీ వివరించింది. అదానీ డెట్ సెక్యూరిటీలన్నింటికీ రేటింగ్ 'AA'లేదా అంతకంటే ఎక్కువ ఉందని స్పష్టం చేసింది.

పెట్టుబడుల వివరాలు..
ఎల్ఐసీకి అదానీ ఎంటర్ప్రైజెస్ కంపెనీలో ఎల్ఐసీ 4,81,74,654 షేర్లు, అదానీ పోర్ట్స్ లో 19,75,26,194 షేర్లు, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీలో 4,06,76,207 షేర్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో ఎల్ఐసీకి 2,03,09,080 షేర్లు ఉన్నాయి. నివేదిక విడుదలైన మెుదటి రెండు రోజుల్లో ఎల్ఐసీ రూ.16,580 కోట్లు నష్టపోయింది. దీంతో ఎల్ఐసీ స్టేక్ హోల్డర్లతో పాటు రాజకీయ నాయకులు, మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications