LIC: అదానీ గ్రూప్ టాప్ మేనేజ్మెంట్తో ఎల్ఐసీ ఛైర్మన్ ఎంఆర్ కుమార్ భేటీ..
జీవిత బీమా దిగ్గజం అదానీ గ్రూప్ టాప్ మేనేజ్మెంట్తో సమావేశమైయ్యామని ఎల్ఐసి ఛైర్మన్ ఎంఆర్ కుమార్ ఆదివారం తెలిపారు. గ్రూప్తో తన వ్యాపార అవకాశాలపై ఎల్ఐసి మరింత నమ్మకంగా ఉందన్నారు.US ఆధారిత షార్ట్-సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత ఎదుర్కొంటున్న సంక్షోభంపై వివరణ కోసం LIC అధికారులు అదానీ గ్రూప్ టాప్ మేనేజ్మెంట్ను కలవాలని యోచిస్తున్నారని గత నెల లో కుమార్ చెప్పారు.
హిండెన్బర్గ్ ఆరోపణల తర్వాత LIC పెట్టుబడి పెట్టుబడిదారులు, పాలసీ హోల్డర్లు ఆందోళన చెందారు. రాజకీయ నాయకుల విమర్శలు కూడా పెరిగాయి. హిండెన్బర్గ్ ఆరోపణల వార్తల తర్వాత, LIC CEO సిద్ధార్థ మొహంతి స్పందిస్తూ అదానీ స్టాక్స్పై జీవిత బీమా సానుకూలంగా ఉందని చెప్పారు. "అన్ని పెట్టుబడులు కంపెనీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPలు) ప్రకారం జరిగాయని" వివరించారు.
ఎల్ఐసి రొటీన్గా తాను పెట్టుబడి పెట్టే కంపెనీలతో క్రమం తప్పకుండా కమ్యూనికేట్ చేస్తుందని కూడా మొహంతి పేర్కొన్నాడు. ప్రీమియం కంటే 10 రెట్ల కంటే ఎక్కువ బీమా హామీ ఉన్న పాలసీలను రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా అదానీ గ్రూప్ షేర్లలో ఇటీవల పతనం కొనసాగింది. హిండెన్బర్గ్ ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది.