LIC Aadhaar Shila Policy: మహిళల కోసం: రూ.30తో రూ.4 లక్షలు బెనిఫిట్
న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థ అమలు చేస్తోన్న పలు పాలసీలు జనంలోకి చొచ్చుకెళ్లాయి. వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. హెల్త్, సేవింగ్స్ మీద అవగాహన ఏర్పడిన తరువాత.. దీర్ఘకాలిక ప్రయోజనాలను కల్పించడానికి ఉద్దేశించిన ఎల్ఐసీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు పలు రకాల బీమా పథకాలను అమలు చేస్తోంది.
ఆధార్ శిలా పాలసీ..
ఇందులో ఒకటి- ఆధార్ శిలా పాలసీ. ప్రత్యేకించి మహిళల కోసమే అమల్లోకి తీసుకొచ్చింది. ఎనిమిదేళ్ల నుంచి 55 సంవత్సరాల వరకు వయస్సున్న వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. జీవిత బీమా, పొదుపుగా ఉపయోగపడుతుంది. మెచ్యూరిటీ అయిన తరువాత పాలసీదారునికి ఒకేసారి ఈ మొత్తం అందుతుంది.
రూ.3 లక్షల వరకు..
ఒకవేళ దురదృష్టవశావత్తూ మెచ్యూర్డ్ కావడానికి ముందే పాలసీదారు మరణిస్తే- ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. ఆధార్ శిలా పాలసీలో కనిష్ఠంగా జమ చేయాల్సిన మొత్తం 75,000 రూపాయలు. గరిష్ఠంగా 3,00,000 రూపాయలను పాలసీగా కట్టొచ్చు. 10 నుంచి 20 సంవత్సరాల వ్యవధి ఉంటుంది.
10 నుంచి 20 సంవత్సరాల వరకు..
అంటే ప్రీమియం చెల్లించడం మొదలు పెట్టిన నెల నుంచి కనిష్ఠంగా 10 సంవత్సరాలు.. గరిష్ఠంగా 20 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ అయిన తరువాత కనిష్ఠంగా 75,000 రూపాయలు, గరిష్ఠంగా 30 లక్షల రూపాయల మొత్తాన్ని పాలసీదారు తీసుకోవచ్చు.
సంవత్సరాల వారీగా..
20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ ప్లాన్లో చేరితే.. సంవత్సరానికి కట్టాల్సిన ప్రీమియం 10,950 రూపాయలు. ప్రతిరోజూ 30 రూపాయలను కేటాయించగలిగితే ప్రీమియం మొత్తాన్ని కట్టొచ్చు. అలాగే 30 సంవత్సరాల వయస్సులో ఈ పాలసీలో చేరితే 20 సంవత్సరాలకు కట్టాల్సిన మొత్తం 2,19,000 రూపాయలు అవుతుంది.
మెచ్యూరిటీ తరువాత..
మెచ్యూరిటీ అనంతరం 3,97,000 రూపాయలు చేతికి అందుతాయి. ప్రీమియం మొత్తాన్ని ప్రతి నెలా కట్టొచ్చు. లేదా మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి చెల్లించే వెసలుబాటు ఉంది. లేదా సంవత్సరం మొత్తానికీ కలిపి ఒకేసారయినా ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చు.
మహిళల నుంచి ఆదరణ..
మహిళల కోసం ఉద్దేశించినందు వల్ల కొన్ని రాయితీలను కల్పించింది ఎల్ఐసీ. మెచ్యూరిటీ క్లెయిమ్, డెత్ క్లెయిమ్పై పన్ను మినహాయింపు సౌకర్యాన్ని కల్పించింది. ఈ పాలసీకి మంచి ఆదరణ లభిస్తోంది. మహిళల కోసం ఉద్దేశించిన పాలసీ వల్ల మధ్య తరగతి కుటుంబీకుల నుంచి ఆదరణ ఉందని ఎల్ఐసీ అధికారులు చెబుతున్నారు.