కరోనాపై పోరుకు ఎన్నారై బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ రూ.100 కోట్లు ఇచ్చారు. ఈ మొత్తాన్ని పీఎం కేర్స్ ఫండ్కు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్లోని ప్రజలంతా అంకితభావం, ధైర్యం, కరుణ చూపిస్తున్నారని, వారికి మా మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన అలజడి సృష్టిస్తోందని మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశాల్లో పరస్పర సహకరం అవసరమని పేర్కొన్నారు.

ఉచిత భోజనం..
ప్రభుత్వాలు, కంపెనీలు, పౌరులు తమ వనరులను సమకూర్చుకోవడానికి కలిసి పని చేయాలని మిట్టల్ తన ప్రకటనలో తెలిపారు. మహమ్మారిని సాధ్యమైనంత త్వరగా పారద్రోలే చర్యలు తీసుకుంటారని విశ్వసించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ కంపెనీలో ప్రతి రోజుకు 5,000 మందికి ఉచిత భోజనం, 30,000 మందికి పైగా ఫుడ్ కిట్స్ అందిస్తున్నట్లు తెలిపారు.

మెర్సిడెజ్ బెంజ్ సహకారం
పుణేలో కరోనా మహమ్మారి బాధితులకు కోసం 1,500 పడకలతో కూడిన తాత్కాలిక ఆసుపత్రిని నిర్మిస్తామని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ప్రకటించింది. సంస్థలో ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తారని తెలిపింది. వైద్య పరికరాల కోసం రూ.100 కోట్ల విరాళమిచ్చింది.

టిక్టాక్ రక్షణ సూట్స్
వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ సూట్స్, మాస్క్లు అందిస్తామని టిక్టాప్ యాప్ ప్రకటించింది. రూ.100 కోట్ల 4 లక్షల ప్రొటెక్టివ్ సూట్స్, మాస్కులు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు అందిస్తామని, ఇప్పటికే రెండు లక్షల మాస్కులను ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు అందించామని తెలిపింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సుధామూర్తి కుటుంబం అక్షయపాత్ర ఫౌండేషన్కు రూ.10 కోట్ల విరాళం ఇచ్చింది. ఇన్ఫోసిస్ ఇదివరకే రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. జిందాల్ అల్యూమినియం రూ. 5 కోట్లు పీఎం కేర్స్ ఫండ్కు అందించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications