కరోనాపై పోరుకు ఎన్నారై బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ రూ.100 కోట్లు ఇచ్చారు. ఈ మొత్తాన్ని పీఎం కేర్స్ ఫండ్కు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్లోని ప్రజలంతా అంకితభావం, ధైర్యం, కరుణ చూపిస్తున్నారని, వారికి మా మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన అలజడి సృష్టిస్తోందని మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశాల్లో పరస్పర సహకరం అవసరమని పేర్కొన్నారు.

ఉచిత భోజనం..
ప్రభుత్వాలు, కంపెనీలు, పౌరులు తమ వనరులను సమకూర్చుకోవడానికి కలిసి పని చేయాలని మిట్టల్ తన ప్రకటనలో తెలిపారు. మహమ్మారిని సాధ్యమైనంత త్వరగా పారద్రోలే చర్యలు తీసుకుంటారని విశ్వసించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ కంపెనీలో ప్రతి రోజుకు 5,000 మందికి ఉచిత భోజనం, 30,000 మందికి పైగా ఫుడ్ కిట్స్ అందిస్తున్నట్లు తెలిపారు.

మెర్సిడెజ్ బెంజ్ సహకారం
పుణేలో కరోనా మహమ్మారి బాధితులకు కోసం 1,500 పడకలతో కూడిన తాత్కాలిక ఆసుపత్రిని నిర్మిస్తామని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ప్రకటించింది. సంస్థలో ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తారని తెలిపింది. వైద్య పరికరాల కోసం రూ.100 కోట్ల విరాళమిచ్చింది.

టిక్టాక్ రక్షణ సూట్స్
వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ సూట్స్, మాస్క్లు అందిస్తామని టిక్టాప్ యాప్ ప్రకటించింది. రూ.100 కోట్ల 4 లక్షల ప్రొటెక్టివ్ సూట్స్, మాస్కులు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు అందిస్తామని, ఇప్పటికే రెండు లక్షల మాస్కులను ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు అందించామని తెలిపింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సుధామూర్తి కుటుంబం అక్షయపాత్ర ఫౌండేషన్కు రూ.10 కోట్ల విరాళం ఇచ్చింది. ఇన్ఫోసిస్ ఇదివరకే రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. జిందాల్ అల్యూమినియం రూ. 5 కోట్లు పీఎం కేర్స్ ఫండ్కు అందించింది.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications