ఉద్యోగార్థులకు ముందుముందు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) రంగం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉంటుందని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ అన్నారు. లింక్డిన్ లైవ్ ఇంటరాక్షన్లో ఆయన మాట్లాడారు. భారత ఐటీ రంగ ఎంప్లాయిమెంట్ బలంగా కొనసాగుతోందని, ఇది మున్ముందు కూడా పెరుగుతూనే ఉంటుందన్నారు. టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని, ఈ నేపథ్యంలో టాలెంట్, ఐటీ సేవలకు డిమాండ్ ఇలాగే కొనసాగుతుందన్నారు.

వేగవంత డిజిటలీకరణ
కరోనా మహమ్మారి గురించి రాజేష్ గోపినాథన్ మాట్లాడుతూ... ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అనేక విభాగాల్లో రాణించినట్లు తెలిపారు. సవాళ్లను అవకాశంగా మలుచుకుంటున్నట్లుగా అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ డిజిటల్ మార్గంలోకి మారడాన్ని మరింత వేగవంతం చేసిందన్నారు.

డిజిటల్.. సద్వినియోగం
యువ ఉద్యోగార్థులకు ఈ సందర్భంగా సలహా ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒకవేళ ఎలాంటి రెప్యుటేషన్ లేని సంస్థలో ఉండి ఉన్నప్పటికీ, గతంలో ఎన్నడూ లేనంత మెరుగైన స్థితిలో ఉన్నట్లుగానే భావించాలన్నారు. కరోనా తర్వాత టెక్నాలజీకి మరింతగా డిమాండ్ పెరుగుతోందని, ఉద్యోగార్థులకు ఐటీ రంగం ఆకర్షణీయ గమ్యస్థానంగానే ఉంటుందన్నారు. భారత ఐటీ రంగంలో ఉపాధి బలంగా కొనసాగుతోందన్నారు. గత ఐదు నెలలుగా డిజిటల్కు మరింతగా డిమాండ్ పెరిగిందని, టీసీఎస్ వంటి కంపెనీలు దీనిని సద్వినియోగం చేసుకోవడంలో ముందంజలో ఉన్నాయన్నారు.

ఐటీ వ్యయం పెరుగుదల
రాబోయే నాలుగేళ్లలో ఐటీ వ్యయం 4-5 శాతం నుండి 6-8 శాతానికి పెరుగుతుందనే అంచనాలు వెల్లడయ్యాయి. ఐటీ జాబ్ ల్యాండ్ స్పేస్లో భారీ డిమాండ్ ఉంది. క్లౌడ్, డేటా, అలటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాల కోసం డిమాండ్ పెరిగినప్పటికీ, పరివర్తన చెందలేనివారు ఉద్యోగం కోల్పోతున్నారని ఐటీ నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీకి అనుగుణంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కరోనా కారణంగా లక్ష మంది టెక్కీలు కోల్పోతారని అంచనాలు ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications