ఐటీ కంపెనీల్లో నికర నియామకాలు FY22 పెరుగుతాయని వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. 2011-12 తర్వాత మొదటిసారి భారీగా పెరగనున్నట్లు బ్రోకరేజీ కంపెనీ జేఎం ఫైనాన్షియల్స్ పేర్కొంది. గ్లోబల్ కంపెనీలు డిజిటల్ సేవలను స్వీకరించడంలో వేగవంతంగా ఉండటం, డీల్స్ పెరగడం, ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు డిమాండ్ పెరగడం వంటివి కారణంగా పేర్కొంటున్నారు. 2020-21ని భారతీయ ఐటీ కంపెనీలకు ట్రాన్స్ఫార్మేటివ్ కంపెనీగా మారింది.

బోనస్, వేతన పెంపు
కరోనాతో ఐటీ ఉద్యోగాల తీరు మారింది. సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చాయి. ఇదే సమయంలో కంపెనీలకు విదేశాల నుండి వస్తోన్న ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవి అధికంగా ఉండే అవకాశముందనే అంచనాలు ఉన్నాయి. దీనికి తగినట్లు ప్రముఖ ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ఐటీ నిపుణులు అట్టిపెట్టుకునేందుకు బోనస్, వేతన పెంపును అమలు చేస్తున్నాయి.

లక్షల ఉద్యోగాలు
కరోనా అనంతరం వేగంగా కోలుకున్న రంగాల్లో ఐటీ రంగం ముందు ఉంది. ఇందుకు ప్రధాన కారణం అనేక సంస్థలు తమ వ్యాపారాల్ని డిజిటల్ రూపంలోకి మార్చేందుకు ప్రయత్నించడం. దేశీయ ఐటీ దిగ్గజాలు TCS, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, HCL టెక్నాలజీస్ వంటి సంస్థలు ఈ అవకాశాన్ని పూర్తిగా చేజిక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ సంస్థల ఆఫ్ షోర్ ఆదాయాలు 5 శాతం వరకు వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అంచనా. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఈ 5 కంపెనీలు లక్షన్నర మంది ఉద్యోగుల్ని నియమించుకుంటాయని అంచనా.

2012 తర్వాత భారీగా నియామకాలు
2012 తర్వాత ఇంత భారీ ఎత్తున నియామకాలు ఇప్పుడే కనిపిస్తున్నాయి.తక్కువ ఖర్చుతో పనిని పూర్తి చేయడంపై విదేశీసంస్థల దృష్టి సారించాయి. కరోనా వల్ల అమెరికాతో సహా పలు దేశాల్లో సంస్థలు గతేడాది మూతపడ్డాయి. అవన్నీ ఇప్పుడు తిరిగి వ్యాపారాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. తక్కువ బడ్జెట్లో డిజిటల్ కార్యకలాపాలు సాకారం చేసుకునేందుకు థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడుతున్నాయి. అందుకే, భారత్లోని సంస్థలపై అవి దృష్టి సారిస్తున్నాయి. తమ ప్రాజెక్టుల్ని ఇక్కడి సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఆఫ్ షోర్ ప్రాజెక్టులు పెరగడానికి ఇది ప్రధాన కారణంగా చెబుతున్నారు.
More From GoodReturns

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications