IT Firing: దేశంలోని ఐటీ కంపెనీలను కుదిపేస్తున్న మూన్లైటింగ్ వివాదంలో తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో విప్రో తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల్లో 300 మందిని తొలగించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కంపెనీ ఏ ప్రాతిపదికన లేదా ఎలా రెండు ఉద్యోగాలు చేస్తున్న టెక్కీలను గుర్తిస్తోంది అన్నదే చాలా ఆందోళన కలిగించిన విషయం. ఇది ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర టెన్షన్ క్రియేట్ చేస్తోంది.

మూన్లైటర్స్ విషయంలో..
మూన్లైటింగ్ కి పాల్పడే వారి విషయంలో విప్రో తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనే చర్చ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవటానికి ముందు రెండు ఉద్యోగాలు చేస్తున్నవారిని గుర్చించటానికి కొత్త టెక్నిక్ ఫాలో అవుతున్నాయి.

UAN నంబర్ ఆధారంగా..
తమ ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకోవటానికి కంపెనీలకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి UAN ద్వారా తెలుసుకోవటం. దీనిలోని సమాచారాన్ని యాక్సెస్ చేయటం ద్వారా కంపెనీలు మాటవినని టెక్కీలను గుర్తించవచ్చు.

ఇతర మార్గాలు ఏమిటి..?
కంపెనీలు ఫుల్ టైం ఉద్యోగుల విషయంలో మాత్రమే UAN ద్వారా ట్రేస్ చేయడం సాధ్యమవుతుందని తెలుస్తోంది. దీనికి తోడు ఉద్యోగులు ఉపయోగించే ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లను పర్యవేక్షించడం మరొక కీలక మార్గమని తెలుస్తోంది. మీరు కంపెనీ ల్యాప్టాప్ని ఉపయోగిస్తున్నట్లయితే.. అది సర్వర్లో నమోదు చేయబడుతుంది. దీని ద్వారా కంపెనీ తన ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తుంటాయి.

ఇది సరైనదేనా?
EPF సైట్లో అటువంటి డేటా కనుగొనబడితే చర్య తీసుకునే హక్కు కంపెనీకి ఉంది. ఈ విధంగా మీరు రెండు వైపుల నుంచి ఆఫర్లను పొందుతున్నారని గుర్తిస్తాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ఇది పెద్ద ఉల్లంఘన. అయితే భారత్లో ఇది అంత కఠినంగా లేదు.

నిశితంగా పర్యవేక్షణ..
కరోనా తర్వాత ఎక్కువ మంది ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నందున ఎక్కువ మంది ఫ్రీలాన్సింగ్, లేదా మరో కంపెనీకి సైతం చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో కంపెనీలు ఉద్యోగులను నిశితంగా పరిశీలిస్తున్నాయి. విప్రో లాగానే IBM, Infosys, Tech Mahindra లాంటి కంపెనీలు మూన్లైటింగ్ గురించి తమ ఉద్యోగులను హెచ్చరించాయి. కంపెనీ నిబంధనలు అతిక్రమించే టెక్కీలకు సమస్యలు తప్పవని చెప్పుకోవాలి. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్ఫోసిస్ ఇప్పటికే తేల్చి చెప్పింది.

భవిష్యత్తు పరిణామాలు..?
ఐటీ పరిశ్రమలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో టెక్కీలు మాటవినకపోవటాన్ని కంపెనీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఉద్యోగులు మూన్లైటింగ్ను బహిరంగంగా నిర్వహించాలని, దానిని సక్రమంగా చేపట్టడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని నాస్కామ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

శాశ్వత పరిష్కారం ఏమిటంటే..?
మూన్లైటింగ్ విషయంలో ఉద్యోగుల నుంచి పారదర్శకత లేకపోవటం కంపెనీల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఫుల్ టైం ఎంప్లాయిగా ఉంటూ.. దాని గురించి కంపెనీలకు ఉద్యోగులు చెప్పకపోతే అవి సమస్యలకు కారణంగా మారుతున్నాయి. కాబట్టి దీనిపై యాజమాన్యాలు, ఉద్యోగులు కలిసి చర్చించుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

50 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. దిగ్గజ కార్ల కంపెనీ Volkswagen సంచలన ప్రకటన..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications