న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 టైటిట్ స్పాన్సర్ షిప్ విషయంలో అంత ముగిసిందనుకుంటే. మరో కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కంపెనీ వీవో ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో ఫాంటసీ క్రీడల నిర్వహణ సంస్థ 'డ్రీమ్11' స్పాన్సర్ గా వచ్చిన విషయం తెలిసిందే.

డ్రీమ్ 11లో చైనా పెట్టుబడులు...
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ టైటిట్ స్పానరర్గా బీసీసీఐ ‘డ్రీమ్11'ను ఎంచుకోవడాన్ని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) వ్యతిరేకించింది. డ్రీమ్11లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయని పేర్కొంటూ బుధవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేఖ రాసింది. 2020 ఐపీఎల్ టైటిట్ స్పాన్సర్షిప్ను డ్రీమ్11కు అప్పగించడంతో తీవ్ర కలత చెందినట్లు పేర్కొంది. ఎందుకంటే, ఆ సంస్థలో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయని తెలిపింది.

టెన్సెంట్ గ్లోబల్ కీలక వాటాదారు..
చైనాకు చెందిన టెన్సెంట్ గ్లోబల్ అనే సంస్థ డ్రీమ్11లో కీలక వాటాదారు అని పేర్కొంది. డ్రీమ్11కు స్పాన్సర్ షిప్ను కట్టబెట్టడంపై చైనా వస్తువులను బహిష్కరిస్తున్న భారతీయుల మనోభావాలను దెబ్బతీయడమేనని స్పష్టం చేసింది. చైనా వస్తువులను బహిష్కరించాలనే ప్రచారానికి సీఏఐటీ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

డ్రీమ్ 11కు కలిసొచ్చిన అవకాశం..
భారతదేశంలో చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమంగా కొనసాగున్న క్రమంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి చైనా మొబైల్ సంస్థ వీవో తప్పుకుంది. దీంతో సెప్టెంబర్ నుంచి దుబాయ్లో నిర్వహించే ఐపీఎల్ 13వ సీజన్ కోసం బీసీసీఐ కొత్త సంస్థలను స్పాన్సర్ షిప్ కోసం ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో స్వదేశీ కంపెనీలైన టాటా, బైజూస్, పతంజలి లాంటి సంస్థలు పోటీ పడ్డాయి. అయితే, చివరకు డ్రీమ్ 11 రూ. 222 కోట్లకు టైటిల్ స్పానర్స్ హక్కులను దక్కించుకుంది. కాగా, వీవో 430 కోట్ల రూపాయలకుపైగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం వెచ్చిస్తే.. ఇప్పుడు అందులో సగం మొత్తంతోనే డ్రీమ్11 ఆ అవకాశాన్ని దక్కించుకోవడం గమనార్హం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications