International Travellers ALERT: ఇకపై ఆర్థిక నేరగాళ్లు, క్రిమినల్స్ దేశం నుంచి తప్పించుకోవటం కుదరదు. వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని విమాన కంపెనీలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా నేరాలను నిరోధించడం, గుర్తించడం, దర్యాప్తు, ప్రాసిక్యూషన్ చేయటం సులభతరం కానుందని తెలుస్తోంది.

నేరగాళ్లు తప్పించుకోకుండా..
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లాంటి ఆర్థిక నేరగాళ్లు మౌనంగా దేశం విడిచి పారిపోవటం ఇకపై అస్సలు కుదరదు. వీరు దేశంలోని బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను మోసం చేసి ఎగ్గొట్టారు. ప్రస్తుతం విదేశాల్లో విలాసవంతంగా జీవిస్తున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.

జరగకుండా నివారించేందుకు..
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా.. విమానాలు బయలుదేరడానికి 24 గంటల ముందు కస్టమ్స్ అధికారులతో అన్ని అంతర్జాతీయ ప్రయాణీకుల వివరాలను తప్పక అందించాలని ప్రభుత్వం విమానయాన సంస్థలను ఆదేశించింది. నేరస్తులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్.. సోమవారం 'ప్యాసింజర్ నేమ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్స్, 2022' పేరుతో గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.

రీసెర్చ్ చేసేందుకు..
కొత్త చట్టం ప్రకారం నేరస్తులు తప్పించుకోకుండా నిరోధించటానికి ఈ డేటాను ఉపయోగించుకోనుంది. ప్రయాణికుల సమాచారాన్ని ముందుగా విశ్లేషించటం ద్వారా కీలక కేసుల్లో నేరస్తులు తప్పించుకోకుండా ఈ చర్యలు సహకరిస్తాయి. దీనితో పాటు.. స్మగ్లింగ్ వంటి ఏదైనా అక్రమ వ్యాపారాన్ని నిరోధించడంలో ఈ నిబంధన సహాయపడుతుందని తెలుస్తోంది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. "ప్రతి ఎయిర్ ఆపరేటర్ ప్రయాణీకుల పేర్లు, ఇతర రికార్డుల గురించి కస్టమ్స్ విభాగానికి తెలియజేయాలి." సాధారణ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఈ సమాచారాన్ని ఇప్పటికే ఆపరేటర్లు సేకరిస్తుంటారు. కాబట్టి ఇది షేర్ చేయటం చాలా సులువు కూడా.

ప్రక్రియ ఏమిటంటే..
ప్రభుత్వ సూచనల అమలు కోసం ప్రతి ఎయిర్లైన్ ఆపరేటర్ కస్టమ్స్లో నమోదు చేసుకోవాలని గెజిట్ నేటిఫికేషన్ పేర్కొంది. విమానయాన సంస్థలు దేశం నుంచి బయటకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణీకుల సమాచారాన్ని అందించాలి. ఈ సమాచారంలో ప్రయాణికుడి పేరు, బిల్లింగ్ చెల్లింపు సమాచారం (క్రెడిట్ కార్డ్ నంబర్), టికెట్ జారీ చేసిన తేదీతో పాటు అదే PNR టిక్కెట్పై ప్రయాణించే ఇతరుల వ్యక్తుల పేర్లతో కూడిన వివరాలు ఉంటాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications