న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వచ్చే 25 నుండి 30 సంవత్సరాలలో దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించగల సామర్థ్యం బిజినెస్, స్టార్టప్ సంస్థలకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్(FDI)లు 13 శాతం పెరిగాయన్నారు.

ఇది సవాల్
ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో పీయూష్ గోయల్ మాట్లాడారు. మన ముందు ఓ సవాల్ ఉందని, 2047లో 100వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే సమయానికి మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండగలదా? అని వ్యాఖ్యానించారు. భారత్ ఈ రోజు సరఫరా గొలుసులో విశ్వసనీయ భాగస్వామిగా ప్రపంచదేశాలకు కనిపిస్తోందన్నారు.

భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నాం
ఈ రోజు మనం అవకాశాలను అందిపుచ్చుకోకుంటే భవిష్యత్తు తరాలు మనలను క్షమించవని పీయూష్ గోయల్ అన్నారు. ఇది మనందరి బాధ్యత అని, అవకాశాలను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్ను మన మంత్రం, స్ఫూర్తి, లక్ష్యంగా మార్చుకోవాలన్నారు. ఆత్మనిర్భర్ను అమలు చేస్తున్నప్పటికీ ప్రపంచంతో సంబంధాలు మరింత పెంచుకోవాలని సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మన దేశం ప్రపంచంతో సంబంధాలను మూసివేయడం లేదని, అందుకు భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా తన భాగస్వామ్యాన్ని విస్తరిస్తోందన్నారు.

కలిసి పని చేస్తేనే
మనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉందని, పనిని వేగవంతంగా చేయడానికి సహాయపడే పరికరాలు అవసరమన్నారు. మంచి నాణ్యత, మంచి ఉత్పాదక ప్రమాణాలు, దేశంలో పోటీ ఉత్పాదక వ్యయం తదితర అంశాల్ని గోయల్ ప్రస్తావించారు.వీటన్నింటిని పెంచడం ద్వారా భారత్ను ప్రపంచ కర్మాగారంగా మార్చవచ్చునని, ఈ రోజున మన దేశాన్ని ప్రపంచ ఫార్మసీగా గుర్తిస్తున్నారన్నారు. మనమంతా ఒకటిగా పని చేద్దామని, కలిసి పని చేద్దామని, 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడానికి పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పని చేయాలన్నారు. 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు మరో ఏడెనిమిదేళ్ల సమయం పట్టవచ్చునని చెప్పారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications