ఇండియన్-అమెరికన్, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికా నేషనల్ పోట్రెయిట్ గాలరీలో ఆమెకు స్థానం దక్కింది. ఆమెతో పాటు అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, ప్రాన్సెస్ అర్నాల్డ్ సహా మరికొంతమందికి ఈ గ్యాలరీలో చోటు దక్కింది. ఈ కార్యక్రమానికి మిచెల్ ఒబామా, హిల్లరీ క్లింటన్ తదితర ప్రముఖులు వచ్చారు. ఈ సందర్భంగా ఇంద్రానూయీ మాట్లాడారు.
మహిళలు తమను తాము సెకండ్ గ్రేడ్ పౌరులుగా పరిగణించుకోవద్దని సూచించారు. స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. కష్టపడి పని చేస్తే పుట్టిన ప్రాంతం, సంస్కృతితో సంబంధం లేకుండా అవకాశాలు వస్తాయన్నారు. తనకు ఈ గౌరవం ఇవ్వడం ద్వారా.. మహిళలు తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అమెరికా గొప్ప దేశమన్న సందేశం ఇచ్చారన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మేలుకొలుపు అన్నారు.

సమాజంలో సానుకూల మార్పు తీసుకు వచ్చే వారికి సరైన గౌరవం లభిస్తుందని చెప్పేందుకు ఇది నిదర్శనం అన్నారు. అమెరికా నిర్మాణం, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వారికి నేషనల్ పోట్రెయిట్ గ్యాలరీలో స్థానం కల్పిస్తారు. దీనిని 1962లో స్థాపించారు. దశాబ్దాలుగా పేయింటింగ్స్, ప్రింట్స్, డ్రాయింగ్, చెక్కినవే కాకుండా ఇటీవలి డిజిటల్ వరకు 23,000కు పైగా ఐటమ్స్ ఈ గ్యాలరీలో ఉన్నాయి. ఈ గ్యాలరీలోకి ప్రతి ఏడాది 150 నుంచి 200 పోట్రెయిట్స్ చేరుతున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications