మార్చిలో భారత రిటైల్ ద్రవ్యోల్భణం 4 శాతంగా ఉండవచ్చు: ఆర్థికవేత్తల అంచనా
భారత రిటైల్ ద్రవ్యోల్భణం మార్చి నెలలో నాలుగు నెలల గరిష్టానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని రూటర్స్ పోల్లో అంచనా వేశారు. అయినప్పటికీ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) టార్గెట్ రేంజ్లోనే ఉంటుందని వెల్లడైంది. ఈ పోల్ ఏప్రిల్ 5వ తేదీ నుండి 8వ తేదీ మధ్య నిర్వహించారు. ఇందులో పాల్గొన్న 50 శాతం మందికి పైగా ఆర్థికవేత్తలు మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం 5.40 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.
అంతకుముందు దీనిని 5.03 శాతంగా అంచనా వేశారు. భారత కోర్ ద్రవ్యోల్భణం సానుకూలంగా ఉండవచ్చునని అంచనా వేశారు. ఇటీవల భారీగా పెరిగిన ఆహార పదార్ధాల థలలు పతాక శీర్షికలకు ఎక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రికవరీ వేగంగా కనిపిస్తోందని, అయితే ఇది ఎంత వరకు కొనసాగుతుందో చూడాలని నిపుణులు అంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ కూడా ఇందుకు కారణం.
ఆర్బీఐ మొదటి అర్ధ సంవత్సరంలో ద్రవ్యోల్భణం 5.2 శాతంగా ఉంటుందని అంచనా వేస్తోంది. కేంద్ర బ్యాంకు ద్రవ్యోల్భణ లక్ష్యాన్ని 2 శాతం నుండి 6 శాతం మధ్య నిర్దేశించుకుంది. ఆసియా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేసిందు. అంతకుముందు రెండు త్రైమాసికాలు మైనస్లలోనే ఉంది.