ఢిల్లీ: భారత విదేశీ రుణాలు మార్చి నాటికి 2.8 శాతం పెరిగి 558.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో ఎక్కువగా కమర్షియల్ రుణాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం రుణభారం రూ.101.3 లక్షల కోట్లు ఉండగా, అందులో విదేశీ రుణభారం రూ.41.88 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాది మార్చి చివరి నాటికి మొత్తం రుణభారం రూ.94.6 లక్షల కోట్లు ఉండగా, విదేశీ రుణభారం రూ.41.73 లక్షల కోట్లుగా ఉంది.

పెరిగిన విదేశీ రుణాలు
2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎక్స్టటర్నల్ డెబిట్స్తో ఫారెన్ కరెన్సీ రిజర్వ్ రేషియం 85.5 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇది 76 శాతంగా ఉంది. జీడీపీలో విదేశీ రుణాల రేషియో 2020 మార్చి చివరి నాటికి 20.6 శాతం పెరిగాయి. అంతకుముందు ఏడాది ఇది 19.8 శాతంగా ఉంది. ఈ మేరకు ఇండియా ఎక్స్టర్నల్ డెబిట్స్: ఎ స్టేటస్ రిపోర్ట్: 2021-20 రిపోర్ట్ వెల్లడిస్తోంది. 2019 మార్చి చివరి నాటితో పోలిస్తే సావరీన్ డెబిట్స్ 3 శాతం క్షీణించి 100.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సావరీన్ రుణాల్లో ఎక్కువగా ఉండే ద్వైపాక్షిక వనరుల వంటి రుణాలు 4.9 శాతం పెరిగి 87.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి. నాన్ సావరీన్ రుణాలు 4.2 శాతం పెరిగి 457.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య రుణాలు సమీకరించడమే ఇందుకు కారణమని తెలిపింది.

వర్తమాన మార్కెట్లో రుణభారం
ఎన్నారై ఔట్స్టాండింగ్ డిపాజిట్ల 130.6 బిలియన్ డాలర్లగా ఉంది. ఇది దాదాపు గత ఏడాదితో సమానం. పలు వర్థమాన మార్కెట్లలో ఆర్థికరంగం విస్తరిస్తుంటే విదేశీ రుణభారం పెరగడం సహజమేనని, ఇందుకు భారత్ కూడా అతీతం కాదని ఈ నివేదిక పేర్కొంది. గత కొన్నేళ్లలో ప్రయివేటు కంపెనీలు విదేశీ వాణిజ్య రుణాలు సమీకరించడాన్ని ప్రోత్సహించేలా విధానాల్లో మార్పువల్ల ప్రయివేటు విభాగంలో రుణసమీకరణ పెరిగిందని తెలిపింది.

ఆర్థికేతర రంగాల సంస్థలు
ప్రధానంగా ఆర్థికేతర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఎక్కువ మొత్తాల్లో రుణాలు సమీకరించినట్టు తెలిపింది. ఈ విభాగంలో మొత్తం రుణ సమీకరణలో ఆ సంస్థలు తీసుకున్న రుణాల వాటా 42 శాతం ఉంది. డిపాజిట్ సేకరించే కార్పొరేషన్స్ ద్వారా సమీకరించిన రుణాలు 28 శాతం ఉంది. సాధారణ ప్రభుత్వ రుణాల వాటా 18.1 శాతం ఉంది. మొత్తం రుణభారంలో ఏడాదికి పైబడి మెచ్యూరిటీ కలిగిన దీర్ఘకాలిక విదేశీ రుణాల వాటా 81 శాతం ఉండగా, మిగతా 19 శాతం స్వల్పకాలిక వాణిజ్య రుణాలు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications