భారతీయ ఐటీ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) డబుల్ డిజిట్ వృద్ధి రేటును సాధిస్తుందని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ అన్నారు. కరోనా ఉధృతి సమయంలో ఈ ప్రపంచాన్ని ఐటీ నడిపిస్తోందని, అలాగే, మార్పులు తీసుకు వస్తోందన్నారు. మంగళవారం సాయంత్రం బాంబే చార్టర్డ్ అకౌంట్స్ సొసైటీ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. నాస్కాం డేటా ప్రకారం ఐటీ ఇండస్ట్రీ రెవెన్యూ FY21లో 194 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ గురువారం నుండి వివిధ ఐటీ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి.

డబుల్ డిజిట్ వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరంలో(2021-22) ఐటీ పరిశ్రమ డబుల్ డిజిట్ వృద్ధి సాధిస్తే తాను ఏమీ ఆశ్చర్యపోనని, ఓ వైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఐటీ పరిశ్రమ రెండు శాతం నుండి మూడు శాతం వృద్ధి చెందిందని, 2021 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ప్రేమ్జీ అన్నారు. కరోనా కారణంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కలిగిందన్నారు. 90 శాతం మంది ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నారని తెలిపారు.

నైపుణ్య కేంద్రంగా..
ఇల్లు, కార్యాలయం మధ్య సమన్వయం కొనసాగిస్తూ నిర్వహిస్తోన్న ఈ హైబ్రిడ్ వర్క్ మోడల్ పోటీ ప్రయోజనాన్ని అందిస్తోంది. దీంతో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి మెరుగైన భాగస్వామ్యానికి అవకాశం ఉండటంతో పాటు, మహిళలు వారి వృత్తిని కొనసాగించే సౌలభ్యాన్ని కల్పిస్తుందన్నారు. అంతర్జాతీయంగా భారత్ను నైపుణ్య కేంద్రంగా మార్చేందుకు అందరు కలిసి పని చేయాల్సిన అవశ్యతను అజీమ్ ప్రేమ్జీ గుర్తు చేశారు.

భారత్ లక్ష్యం
అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే భారత్ లక్ష్యానికి ఐటీ పరిశ్రమ దోహదపడుతుందన్నారు. అలాగే, కోవిడ్ 19 పైన పోరు కోసం విప్రో రూ.1000 కోట్లు కేటాయిస్తుందని అజీమ్ ప్రేమ్ జీ అన్నారు. దేశంలో స్కూల్స్ రీ-ఓపెనింగ్ పైన ఆయన ఆశాభావ దృక్ఫథంతో ఉన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications