IT Jobs: భారత IT ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. కంపెనీలు చేస్తున్న ఆ పనితో ఇక కష్టమే..
IT Jobs: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక, ఉక్రెయిన్లను భారీ తగ్గింపుతో టెక్ టాలెంట్లను ఉద్యోగాల్లో నియమించుకోవాలని చూస్తోంది. పొరుగున ఉన్న శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, యుద్ధం కారణంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ సాంకేతిక ప్రతిభకు విలువను అందిస్తున్నాయని కొన్ని కంపెనీలు, HR సంస్థలు అంటున్నాయి. ప్రస్తుత మార్కెట్ ధరతో పోల్చినప్పుడు ఈ ప్రతిభావంతులు 40 శాతం నుంచి 65 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉన్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. భారతదేశంలో టెక్ టాలెంట్ వార్ను ఎదుర్కోవడానికి కంపెనీలు ఈ దేశాల నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుని ప్రయోగాలు చేయడం ప్రారంభించాయి.
ప్రయోగాత్మకంగా
నియామకాలు..
"
మా
ఈ
ప్రయత్నం
టెక్
టాలెంట్
వార్కు
మరొక
పరిష్కారం.
మేము
రెగ్యులర్
నెట్వర్క్లను
దాటి
వెళ్లడం
ప్రారంభించాము.
మేము
నైజీరియా
,
శ్రీలంక
నుంచి
కొంతమంది
UI
డెవలపర్లతో
ప్రయోగాలు
చేశాము.
మేము
ఉక్రెయిన్
నుంచి
కూడా
ఈ
డెవలపర్లలో
కొందరిని
కూడా
పరిశీలించాము"
అని
డిజిట్
ఇన్సూరెన్స్లో
చీఫ్
హ్యూమన్
రిసోర్స్
ఆఫీసర్
అమృత్
జైద్కా
అరోరా
అన్నారు.
ఉద్యోగాలు
కోల్పోతున్న
వారిని
కాంట్రాక్ట్
పద్ధతిలో
తక్కువ
ఖర్చుకే
పనిచేస్తున్నట్లు
తెలిపారు.
చాలా
కంపెనీలు
ఫ్రెషర్స్
ను
రిక్రూట్
చేసుకుంటున్నాయి.
ఈ
ట్రైల్స్
ను
రెండు
నెలల
క్రితం
ప్రారంభించినట్లు
తెలిపారు.
ఖర్చులు
పెరగటంతోనే
అలా..
శ్రీలంక
ప్రస్తుతం
అత్యంత
దారుణమైన
ఆర్థిక
సంక్షోభాన్ని
ఎదుర్కొంటోంది,
ఫారెక్స్
నిల్వలు,
భారీ
రుణాల
కుప్పలు,
రుణాలను
తీర్చలేకపోవడం,
కరెన్సీ
విలువ
తగ్గింపు,
అధిక
ద్రవ్యోల్బణం,
ఆహార
సంక్షోభం
వంటి
సమస్యలు
అక్కడి
ప్రజలకు
కంటి
మీద
కునుకు
లేకుండా
చేస్తున్నాయి.
మరోవైపు
ఉక్రెయిన్
నాలుగు
నెలల
క్రితమే
రష్యాతో
యుద్ధానికి
దిగింది.
ఇదే
క్రమంలో
గత
సంవత్సర
కాలంగా
టాలెంటెడ్
ఉద్యోగులకు
వెచ్చిస్తున్న
వ్యయాలు
మన
దేశంలోని
కంపెనీలకు
300
శాతం
మేర
పెరిగాయి.
దీనికి
తోడు
రిమోట్
లొకేషన్స్
నుంచి
పనిచేయటం
వల్ల
కంపెనీలు
సైతం
విదేశీయులకు
అవకాశాలు
అందిస్తున్నాయి.
"డేటా
సైంటిస్ట్లు,
డెవలపర్లు,
ఇన్ఫర్మేషన్
సెక్యూరిటీ
అనలిస్ట్లు,
క్లౌడ్
ఆర్కిటెక్ట్
పాత్రలతో
సహా
కీలకమైన
సాంకేతిక
పాత్రల
కోసం"
ఈ
సంక్షోభ
దేశాల
నుంచి
నియామకాలు
జరుగుతున్నాయి.
వారికి
చెల్లిస్తున్న
ప్యాకేజీలు
2019
కరోనాకి
ముందు
నాటి
చెల్లింపులతో
సమానమైనవిగా
రిక్రూట్
మెంట్
ఏజన్సీలు
చెబుతున్నాయి.