భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇందులో భాగంగా భారత్ ఆర్థిక రంగం కూడా సవాళ్లు ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదివారం 'The Rise of Finance: Causes, Consequences and Cure' పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రపంచం.. అలాగే భారత్ ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు.
ఈ పుస్తకాన్ని వీ అనం నాగేశ్వరణ్, గుల్జార్ నటరాజన్ కలిసి రాశారు. నాగేశ్వరన్ IFMR గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్. నటరాజన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ పుస్తకంపై నిర్మల మాట్లాడుతూ... ఇది పాఠకుల ఆదరణ పొందుతుందని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితులకు ఈ పుస్తకం అద్దం పడుతోందన్నారు.
సింపుల్ SIP ట్రిక్తో రూ.60 లక్షల నుంచి రూ.1.12 కోట్ల సంపాదన
చాలా వాటికి సమాధానాలు కూడా దొరుకుతాయని చెప్పారు. భారతదేశం అనేక ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈ పుస్తకం రావడం అభినందనీయమన్నారు. మందగమనంపై ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఇది వచ్చిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగడంతో అది భారత్ పైన కూడా ప్రభావం చూపిందని నిర్మల అన్నారు.